CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
- విద్యాసంస్థల్లో డ్రగ్స్పై జీరో టాలరెన్స్
- యాజమాన్యాలకే పూర్తి బాధ్యతలు అప్పగింపు
- QR కోడ్, టోల్ఫ్రీతో ఫిర్యాదు వ్యవస్థ
- కొత్త చట్టంపై అధ్యయనానికి సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, భద్రతా కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని స్పష్టం చేసిన సీఎం, వీటి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యాసంస్థలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలకే పూర్తి బాధ్యతలను అప్పగించాలని స్పష్టం చేశారు.
విద్యాసంస్థల్లో నిఘా.. యాజమాన్యాలకే పూర్తి బాధ్యత
క్యాంపస్ లోపల డ్రగ్స్కు సంబంధించి ఏ చిన్న ఘటన చోటుచేసుకున్నా సదరు విద్యాసంస్థ యాజమాన్యాన్నే పూర్తి బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతలను కూడా అప్పగించాలని ఆదేశించారు. క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
Also Read
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
క్యూఆర్ కోడ్, టోల్ ఫ్రీ నెంబర్లు.. త్రీ-స్టెప్ యాక్షన్ ప్లాన్
డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్లను అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే మూడు దశలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిని వెంటనే డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్ ఇవ్వాలని, అయితే పదే పదే పట్టుబడితే మాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే నూతన చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!