Congress: ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావ్ సరే.. ముందు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు శశిథరూర్!
- కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా తన వైపే చూస్తున్నారు: శశిథరూర్
- ఎంపీ శశిథరూర్ మొదట ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించిన కేరళ కాంగ్రెస్ పార్టీ నేతలు
- 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే మా టార్గెట్: కేరళ కాంగ్రెస్ నేత కె.మురళీధరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక, సర్వేల్లో ఎవరో ఒకరు మొదటి వరుసలో ఉంటారు.. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే, దానికి చెందిన వ్యక్తే చీఫ్ మినిస్టర్ అవుతారు.. మా అసలు టార్గెట్ ఎన్నికల్లో విజయం సాధించడమే.. శశిథరూర్ అనవసర వివాదాలు సృష్టించొద్దు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ స్పష్టం చేశారు.
Read Also: Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇక, ఎంపీ శశిథరూర్కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. పార్టీ నేతలకు, ఆయనకు మధ్య వరుసగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే, సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ శశిథరూర్ ఓ వ్యాసం రాశారు. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. కొందరికి మోడీనే ప్రాధాన్యమంటూ మండిపడ్డారు. దీనికి కౌంటర్గా థరూర్ ఓ పక్షి ఫొటోను షేర్ చేసి.. ఎగరడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. రెక్కలు నీయి.. ఆకాశం ఎవరి సొంతం కాదు అనే సందేశాన్ని రాసుకొచ్చాడు. శశిథరూర్ మెసేజ్ పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. ఎగరడానికి పర్మిషన్ అడగొద్దు.. కానీ, ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనించాలి.. ఆ పక్షులను ఎల్లప్పుడూ గద్దలు, రాబందులు వేటాడుతూనే ఉంటాయని సూచించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?