Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఫ్రీ-ఫెయిర్ గా జరగలేదని ఆయన అన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగలేదని వ్యాఖ్యానించారు.
దాదాపుగా 20 ఏళ్ల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని శశిథరూర్ ఆరోపించారు. పోటీలో మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం ఆమోదం లభించింది. బుధవారం ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగానే.. థరూర్ టీం ఎన్నికల్లో సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. కౌంటింగ్ లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎలక్షన్ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి ఫిర్యాదు చేసింది థరూర్ వర్గం. ఫోటోలు, కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Deputy Speaker Padma Rao: అవన్నీ పుకార్లే.. ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ తోనే
థరూర్ ఎన్నికల ఏజెంట్ సల్మాన్ సోజ్, మిస్త్రీకి లేఖ రాశారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువగా అవకతవకలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. అనధికారిక సీల్స్, బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 24 ఏళ్ల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో ఆరోసారి ఎన్నికలు జరిగాయి.
ఇదిలా ఉంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ల మద్దతు మల్లికార్జున ఖర్గేకు మద్దతు తెలిపారు. పోటీలు ఉన్న శశిథరూర్ కు పార్టీ నుంచి పెద్దగా మద్దతు రాలేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఖర్గే గెలిస్తే గాంధీల కుటుంబం రిమోట్ కంట్రోల్ పాలన చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. కాసేపట్లో రిజల్ట్స్ వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ అంశం కాకపుట్టిస్తోంది. అయితే శశిథరూర్ రాసిన లేఖను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!