Maharashtra: శరద్ పవార్ పార్టీకి షాక్! మహాయుతి వైపు చూస్తున్న ఎంపీలు!
- శరద్ పవార్ పార్టీకి షాక్!
- మహాయుతి వైపు చూస్తున్న ఎంపీలు!
- కొట్టిపారేసిన శరద్ పవార్ పార్టీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ నుంచి చాలా మంది ఎంపీలు, ముఖ్యంగా NCP (SP) పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు మహాయుతి వైపు చూస్తు్న్నారని బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ బుధవారం వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొంత మంది ఎంపీలు టచ్లోకి వచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే చేరికలు ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
అభివృద్ధి కోసం, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారడం సహజమేనని ప్రవీణ్ దారేకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇదిలా ఉంటే దారేకర్ వ్యాఖ్యలను ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు విద్యా చవాన్ తోసిపుచ్చారు. మిత్రపక్షాల మద్దతు కోల్పోయే భయంతో బీజేపీ.. ప్రతిపక్ష నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో నడుస్తోందని.. వారు మద్దతు ఉపసంహరించుకుంటారేమోనన్న భయంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు గాలం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఎలాంటి ప్రలోభాలకు గురికారని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు దృఢంగా ఉన్నారని, సంకీర్ణానికి ద్రోహం చేయరని విద్యా చవాన్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 235 స్థానాలు గెలుచుకుంది. మహా వికాస్ అఘాడీ కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. ముఖ్యమంత్రి స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!