Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలు నష్టపోయిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
Read Also:Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్, కోర్టు దీనిని పరిశీలిస్తుందని.. అత్యవసర విచారణ కోసం జాబితా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ కేసులో పరస్పర విరుద్ధమైన తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తామని సీజేఐ అన్నారు.
2022 అక్టోబర్ తీర్పులో.. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఓ న్యాయమూర్తి చెప్పగా, మరొకరు హిజాబ్ అనేది ముస్లిం మహిళల హక్కు అని పేర్కొన్నాడు. అంతకుముందు కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిజాబ్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు నడిచాయి. దీంతో ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. గతేడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, పాఠశాల్లో హిజాబ్ బ్యాన్ సక్రమే అని తీర్పు చెప్పింది. దీంతో పలువురు ముస్లిం విద్యార్థినులు, హక్కుల సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!