Operation Sindoor: పాక్లో ధ్వంసమైన ప్రాంతాలివే.. ఉపగ్రహ చిత్రాలు విడుదల
- ఆపరేషన్ సిందూర్ కారణంగా పాక్లో ధ్వంసమైన ప్రాంతాలివే
- ఉపగ్రహ చిత్రాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడింది. భారత్ కొట్టిన దెబ్బకు దాయాది దేశం వణికిపోయింది. దెబ్బకు శత్రు దేశం కాళ్ల బేరానికి వచ్చింది. అంతగా పాకిస్థాన్ హడలెత్తిపోయింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్లో ఏఏ ప్రాంతాలు ధ్వంసమయ్యాయో.. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Kolkata: కోల్కతా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. హై అలర్ట్ ప్రకటన
Also Read
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
భారత్ చేపట్టిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో హ్యాంగర్లు, రన్వేలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రన్వేలపై గుంటలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించినవి చిత్రాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు చేసింది.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీతో తీసిన హై-రిజుల్యూషన్ చిత్రాలు బయటకు వచ్చాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, సింద్లోని సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్ వంటి వైమానిక సైనిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చిత్రాల్లో భారీగా నష్టం జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సింధ్లోని షాబాజ్ జకోబాబాద్, ఉత్తర తట్టాలోని భోలారి ప్రాంతాలు ఉన్నాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ముందే పురుషులను కాల్చి చంపేశారు. దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఎలాగైనా పాకిస్థాన్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దీంతో మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్పై భారత వాయుసేన మెరుపుదాడులు చేసింది. దీంతో నూర్ ఖాన్ ఎయిర్బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాకిస్థాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.





తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!