Sanjay Raut: ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీకి రూ. 100 కోట్లు.. మొత్తంగా రూ.2000 కోట్ల డీల్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కోల్పోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని.. వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని.. ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను వెల్లడించారని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని రౌత్ అన్నారు.
Read Also: Delhi: భూతవైద్యం పేరుతో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
మా పార్టీ, విల్లుబాణం గుర్తును కొనుగోలు చేసేందుకు భారీగా డీల్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు, ఎంపీలకు రూ. 100 కోట్లు, మా కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు రూ. 50 లక్షల నుంచి 1 కోట్ల వరకు చెల్లించి పార్టీ మారేలా చేశారని.. అలాంటిది మా పార్టీని, చిహ్నాన్ని తీసుకోవడానికి ఎంత చెల్లించి ఉండాలో అంచనా వేయండి..? అంటూ ప్రశ్నించారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రి సత్యమేవ జయతే అంటూ వ్యాఖ్యానించారు.
అమిత్ షా చెప్పే దాన్ని సీరియస్ గా తీసుకోలేదని.. న్యాయం, సత్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తుల గురించి మనం ఏం చెప్పగలం? అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనినేది సమయం వచ్చినప్పుడు చూపెడతాం అని.. ఇప్పుడే దీనిపై ఏం మాట్లాడం అని సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఏక్ నాథ్ షిండే వర్గం ఈ విమర్శలను తోసిపుచింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
-
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!