Devendra Fadnavis: ముంబై సురక్షితమైన ప్రాంతం.. ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు
- ముంబై సురక్షితమైన ప్రాంతం
- ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విపక్ష పార్టీలు.. అధికార బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బెంగాల్ సీఎం మమత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయా పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. భద్రతకు ముంబై క్షేమం కాదంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. కేజ్రీవాల్ ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రస్తావన..
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
విపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ముంబై సురక్షితమైన ప్రాంతమని.. ఒక్క ఘటనతో బీజేపీపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. భారత్లో అన్ని మెగా సిటీల్లో.. ముంబైనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడితో భద్రతపై విమర్శించడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఐటీ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. దొంగ అలజడితో నిద్ర లేచిన సైఫ్ అలీఖాన్.. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తిరగబడ్డాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆరు కత్తి పోట్లు అయినట్లు సమాచారం. వెన్నెముకకు తీవ్రమైన గాయం కావడంతో సైఫ్కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్కి అతిపెద్ద మద్దతుదారులు భారతీయులే.. తాజా సర్వేలో వెల్లడి..
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?