Devendra Fadnavis: ముంబై సురక్షితమైన ప్రాంతం.. ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు
- ముంబై సురక్షితమైన ప్రాంతం
- ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్య
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విపక్ష పార్టీలు.. అధికార బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బెంగాల్ సీఎం మమత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయా పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. భద్రతకు ముంబై క్షేమం కాదంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. కేజ్రీవాల్ ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రస్తావన..
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
విపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ముంబై సురక్షితమైన ప్రాంతమని.. ఒక్క ఘటనతో బీజేపీపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. భారత్లో అన్ని మెగా సిటీల్లో.. ముంబైనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడితో భద్రతపై విమర్శించడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఐటీ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. దొంగ అలజడితో నిద్ర లేచిన సైఫ్ అలీఖాన్.. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తిరగబడ్డాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆరు కత్తి పోట్లు అయినట్లు సమాచారం. వెన్నెముకకు తీవ్రమైన గాయం కావడంతో సైఫ్కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్కి అతిపెద్ద మద్దతుదారులు భారతీయులే.. తాజా సర్వేలో వెల్లడి..
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!