S Jaishankar: బీబీసీపై ఐటీ దాడులు.. యూకే మంత్రికి స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar’s Strong Reply To UK Minister: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపధ్యంలోొ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీపై ఆరోపణలు గుప్పిస్తూ రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ వివాదం ఇటు భారత్ లో అటు యూకేలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ ప్రభుత్వం అయితే దీన్ని ఏకంగా ‘‘ వలసవాద మనస్తత్వం’’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. ఈ పరిణామాల తర్వాత ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేసింది. భారత చట్టాలకు అనుగుణంగా అకౌంట్స్ నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే విదేశాంగ మంత్రి జెమ్స్ జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఇరువురి మధ్య బీబీసీ వ్యవహారం చర్చలోకి వచ్చింది. అయితే దీనిపై ఎస్ జైశంకర్ యూకేకు ఘాటు రిఫ్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పనిచేసే ఏ సంస్థ అయినా భారతీయ చట్టాలకు లోబడి ఉండాలని సూటిగా చెప్పారు. భారత్ లో పనిచేస్తున్న సంస్థలు ఇక్కడి చట్టాలు, నియమాలను పాటించాలని యూకే విదేశాంగ మంత్రికి చెప్పారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Manchu Manoj: మోహన్ బాబు లేకుండానే మనోజ్ రెండో పెళ్లి..?
ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంట్ పై యూకే ఎంపీలు రెండుగా చీలిపోయారు. కొందరు ప్రధాని మోదీని సమర్థించగా.. మరికొందరు బీబీసీకి వత్తాసు పలికారు. అయితే బీబీసీని యూకే ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. ఇటీవల విదేశీ, కామన్వెల్త్ అభివృద్ధి పార్లమెంటరీ అండర్ సెక్రటరీ డేవిడ్ రూట్లీ మాట్లాడుతూ.. మేము బీబీసీకి అండగా నిలుస్తాం, బీబీసీకి నిధులు సమకూరుస్తాం, బీబీసీ ప్రపంచానికి ముఖ్యమైదనదిగా భావిస్తున్నామని అన్నారు. భారత్ తో సహా తమ మిత్రదేశాలు బీబీసీ ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీ అనుకోకుండా వచ్చిన డాక్యుమెంటరీ కాదని, దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మీరు భారత ప్రధాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా దీన్ని రూపొందిస్తారు..? అని ప్రశ్నించారు. భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే ఇలాంటి వాటి ఉద్దేశ్యమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!