Mohan Bhagwat: భారత్లోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS chief Mohan Bhagwat’s comments on Muslims and LGBL communities: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు ఎలాంటి భయాలు వద్దని, ఇస్లాం భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ‘ఆర్గనైజర్’, ‘పాంచజన్య’ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేము ఒక సారి ఈ భూమిని పాలించాం.. మళ్లీ పరిపాలిస్తాం.. వంటి ఆధిపత్య ధోరణిని విడిచిపెట్టాలని హితవు పలికారు. గత 1000 ఏళ్లుగా విదేశీ దురాక్రమణదారుల నుంచి హిందువులు యుద్ధం చేస్తున్నారని అన్నారు. వీటన్నింటితో హిందు సమాజం మేల్కొందని.. యుద్ధంలో ఉన్నవారు దూకుడుగా వ్యవహరించడం సహజమే అని ఆయన అన్నారు.
Read Also: Manik rao Thackeray: తెలంగాణలో థాక్రే పర్యటన.. అక్కడకు రావాలని కోమటిరెడ్డి ఫోన్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
హిందూ అనేది మన గుర్తింపు, మన జాతీయత, మన నాగరిక లక్షణం, అందరిని మనవారిగా భావించే లక్షణం అని అన్నారు. హిందుత్వ భావనను మరిచిన సమయంలో అఖండ భారతంగా ఉన్న దేశం విభజనకు గురైందని అన్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో దూరంగా ఉందని.. అయితే మన జాతీయ విధానాలు, జాతీయ ప్రయోజనాలు, హిందూ ప్రయోజనాలను ప్రభావితం చేసేత రాజకీయాల్లో మాత్రం ఎల్లప్పుడు నిమగ్నం అయి ఉందని అన్నారు. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ ను ధిక్కార ధోరణితో చూసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయని ఆయన అన్నారు. ఇంతకుముందు స్వయం సేవకులు రాజకీయా అధికార స్థానాల్లో లేరు.. ప్రస్తుత పరిస్థితిలో ఇది ఒక్కటే మారిందని.. స్వయం సేవకులు రాజకీయాల్లో ఏది చేసినా.. సంఘ్ దానికి జవాబుదారీగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఎల్జీబీటీ( లెస్బియన్, గే, బై-సెక్చువల్, ట్రాన్స్ జెండర్) వర్గాలకు మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వారు కూడా భాగమే అని అన్నారు. మానవులు ఉన్నంత కాలం ఈ జీవనవిధానం కొనసాగతుందని.. ఈ సమస్యల పరిష్కారానికి అనుసరించే మార్గాలు నిష్ఫలం అవుతాయని..ఆర్ఎస్ఎస్ వారికి అండగా ఉంటుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!