RG Kar Rape Case: మమత సర్కార్పై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు
- మమత సర్కార్పై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు
- ఆర్జీ కర్ ఘటనను నీరుగార్చారని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యాచార ఘటనలో ప్రధాన నిందితులను మమతా బెనర్జీ ప్రభుత్వం, సీబీఐ కాపాడుతున్నాయని.. కవచంగా ఉన్నాయని తీవ్రంగా ఆరోపించారు. ప్రధాన సూత్రదారులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నేరస్తులను గుర్తించడంలో సీబీఐ విఫలమైందని ధ్వజమెత్తారు. కోల్కతా పోలీసులు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు.. జరిగిన ఘోరాన్ని కప్పిపెట్టేశారన్నారు. నిజం ఎప్పటికీ బయటకు రాకుండా చూస్తుకున్నారని బాధితురాలి తల్లి బెంగాల్ స్థానిక మీడియాతో వాపోయింది. నేరస్థలాన్ని ఎందుకు సీల్ చేయలేదని.. అలాగే అనేక మంది ప్రత్యక్ష సాక్షులను ఎందుకు తారుమారు చేశారని నిలదీశారు. సంఘటన జరిగిన రోజు నిఘా ఫుటేజీలో 68 మంది వ్యక్తులు ఉన్నట్లు చూపించారని.. చివరికి సంజయ్ రాయ్ ఒక్కడినే నేరస్తుడిగా గుర్తించారని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనపై కోల్కతా పోలీసులు గానీ.. సీబీఐ గానీ సరైన దర్యాప్తు చేయలేదని బాధితురాలి తండ్రి ఆవేదన చెందారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. రాజకీయ ప్రేరేపణ కారణంగానే జరిగిన ఘోరం సద్దుమణిగిపోయిందన్నారు. చివరికి న్యాయం అసంతృప్తిగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలను టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఖండించారు. పార్టీని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టను దిగజార్చేందుకు శక్తులు పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్జీ కర్ ఘటనపై ముఖ్యమంత్రి మమత సీరియస్ ఆదేశాలు ఇచ్చారని.. ఆమె చొరవతోనే కొద్దిరోజుల్లోనే నిందితుడికి శిక్ష పడిందని తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇటీవల నిందితుడికి కోల్కతా కోర్టు.. జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై విమర్శలు వెల్తువెత్తాయి. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక సీబీఐ కూడా కోల్కతా హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరింది.
ఇది కూడా చదవండి: Kolusu Partha Sarathy: అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం..
తాజావార్తలు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?