Revanth Reddy : సింగరేణి దోపిడీపై సీబీఐ విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy Fired on BJP and TRS Governments.
తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసిచూడనట్లుగా ఉందని, సింగరేణి దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కార్పోరేషన్లో నియమ నిబంధనలు ఉల్లంఘించి టెండర్లు ప్రతిమా శ్రీనివాస్, కేసీఆర్ గ్యాంగ్ కు కట్టబెట్టిన తీరుపై సీబీఐతో విచారణ జరపాలన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఆదానీ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రానికి 49 శాతం వాటాలున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణి సీఎండిగా శ్రీధర్ 8వ సంవత్సరం కూడా కొనసాగుతున్నారని, కేంద్రం అనుమతి లేనిదే ఒక అధికారిని ఎలా కొనసాగిస్తారన్నారు. ఆదానీని అడ్డంపెట్టుకుని ఒరిస్సాలోని నైనీ బొగ్గు గనులను ప్రతిమా శ్రీనివాస్ కు కట్టబెట్టారని, సింగరేణి కుంభకోణం పై సీబీఐ విచారణ చేపట్టకపోతే ఇక కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!