Restaurant: ఫుడ్ ఆర్డర్తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్కి రూ. 35000 ఫైన్..
- ఫుడ్ ఆర్డర్తో పాటు ‘‘ఊరగాయ’’ ఇవ్వని రెస్టారెంట్..
- వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన బాధిత కస్టమర్..
- రూ. 30000 ఫైన్ విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Restaurant: వినియోగదారుడికి సరైన సేవల్ని అందించలేని రెస్టారెంట్కి కోర్టు భారీ జరిమానాను విధించింది. రెస్టారెంట్ సేవల్లో లోపం, వినియోగదారుడికి శారీరక, మానసిక వేదనను మిగిల్చిందని కోర్టు పేర్కొంది. ‘‘ఊరగాయ’’ని ఇవ్వకుండా కస్టమర్కి మానసకి వేదన కలిగించినందుకు రెస్టారెంట్కి రూ. 35,000 జరిమానా విధించారు. నవంబర్ 2022లో సీ ఆరోగ్యస్వామి అనే కస్టమర్ రూ. 2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే, దాంట్లో హోటల్ బాలమురుగన్ ‘పికిల్’ ఇవ్వలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.
Read Also: UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ఇటీవల తమిళనాడులోని విల్లుపురం న్యాయస్థానం రూ.2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్లో భాగంగా ఉన్న ఊరగాయను డెలివరీ చేయనందుకు పరిహారంతో పాటు కేసు కోసం బాధితుడికి అయిన ఖర్చులతో కలిపి రూ. 35,000 చెల్లించాలని రెస్టారెంట్ యజమానిని ఆదేశించింది. ఆరోగ్యస్వామి తన బంధువు మరణించి ఏడాది కావడంతో 25 మందికి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే, అందులో ఊరగాయ ఇవ్వలేదు. రెస్టారెంట్ సర్వీస్ లోపాలకు సమానమని, ఇది కస్టమర్కి శారీరక కష్టాల్ని, మానసిక వేదనని మిగిల్చిందని కోర్టు పేర్కొంది. బాధిత కస్టమర్ కొనుగోలు చేసిన 25 భోజనాలకు రసీదు కూడా ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.
ఈ కేసులో న్యాయస్థానం రెస్టారెంట్కి రూ. 5000 న్యాయపరమైన ఖర్చులతో పాటు రూ. 30,000 జరిమానా విధించింది. ప్రతీ భోజన పార్సిల్లో వైట్ రైస్, సాంబార్, కూర, రసం, మజ్జిగ, కూట్టు, పొరియాల్, అప్పలం, ఊరగాయ, పెద్ద సైజు అరటి ఆకులు మరియు కవర్ ఉంటాయని హోటల్ ముందుగా చెప్పింది. ఒక్కో పార్సిల్కి రూ. 80 వసూలు చేసింది. అయితే, భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో తనకు అవమానం ఎదురైందని కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊరగాయ వచ్చే సమయానికి అతిథులందరూ తమ భోజనం ముగించాని ఫిర్యాదులో వెల్లడించారు.
- Tags
- Consumer Court
- Food
- Tamil Nadu
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!