Restaurant: ఫుడ్ ఆర్డర్తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్కి రూ. 35000 ఫైన్..
- ఫుడ్ ఆర్డర్తో పాటు ‘‘ఊరగాయ’’ ఇవ్వని రెస్టారెంట్..
- వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన బాధిత కస్టమర్..
- రూ. 30000 ఫైన్ విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Restaurant: వినియోగదారుడికి సరైన సేవల్ని అందించలేని రెస్టారెంట్కి కోర్టు భారీ జరిమానాను విధించింది. రెస్టారెంట్ సేవల్లో లోపం, వినియోగదారుడికి శారీరక, మానసిక వేదనను మిగిల్చిందని కోర్టు పేర్కొంది. ‘‘ఊరగాయ’’ని ఇవ్వకుండా కస్టమర్కి మానసకి వేదన కలిగించినందుకు రెస్టారెంట్కి రూ. 35,000 జరిమానా విధించారు. నవంబర్ 2022లో సీ ఆరోగ్యస్వామి అనే కస్టమర్ రూ. 2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే, దాంట్లో హోటల్ బాలమురుగన్ ‘పికిల్’ ఇవ్వలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.
Read Also: UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఇటీవల తమిళనాడులోని విల్లుపురం న్యాయస్థానం రూ.2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్లో భాగంగా ఉన్న ఊరగాయను డెలివరీ చేయనందుకు పరిహారంతో పాటు కేసు కోసం బాధితుడికి అయిన ఖర్చులతో కలిపి రూ. 35,000 చెల్లించాలని రెస్టారెంట్ యజమానిని ఆదేశించింది. ఆరోగ్యస్వామి తన బంధువు మరణించి ఏడాది కావడంతో 25 మందికి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే, అందులో ఊరగాయ ఇవ్వలేదు. రెస్టారెంట్ సర్వీస్ లోపాలకు సమానమని, ఇది కస్టమర్కి శారీరక కష్టాల్ని, మానసిక వేదనని మిగిల్చిందని కోర్టు పేర్కొంది. బాధిత కస్టమర్ కొనుగోలు చేసిన 25 భోజనాలకు రసీదు కూడా ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.
ఈ కేసులో న్యాయస్థానం రెస్టారెంట్కి రూ. 5000 న్యాయపరమైన ఖర్చులతో పాటు రూ. 30,000 జరిమానా విధించింది. ప్రతీ భోజన పార్సిల్లో వైట్ రైస్, సాంబార్, కూర, రసం, మజ్జిగ, కూట్టు, పొరియాల్, అప్పలం, ఊరగాయ, పెద్ద సైజు అరటి ఆకులు మరియు కవర్ ఉంటాయని హోటల్ ముందుగా చెప్పింది. ఒక్కో పార్సిల్కి రూ. 80 వసూలు చేసింది. అయితే, భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో తనకు అవమానం ఎదురైందని కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊరగాయ వచ్చే సమయానికి అతిథులందరూ తమ భోజనం ముగించాని ఫిర్యాదులో వెల్లడించారు.
- Tags
- Consumer Court
- Food
- Tamil Nadu
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!