Restaurant: ఫుడ్ ఆర్డర్తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్కి రూ. 35000 ఫైన్..
- ఫుడ్ ఆర్డర్తో పాటు ‘‘ఊరగాయ’’ ఇవ్వని రెస్టారెంట్..
- వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన బాధిత కస్టమర్..
- రూ. 30000 ఫైన్ విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Restaurant: వినియోగదారుడికి సరైన సేవల్ని అందించలేని రెస్టారెంట్కి కోర్టు భారీ జరిమానాను విధించింది. రెస్టారెంట్ సేవల్లో లోపం, వినియోగదారుడికి శారీరక, మానసిక వేదనను మిగిల్చిందని కోర్టు పేర్కొంది. ‘‘ఊరగాయ’’ని ఇవ్వకుండా కస్టమర్కి మానసకి వేదన కలిగించినందుకు రెస్టారెంట్కి రూ. 35,000 జరిమానా విధించారు. నవంబర్ 2022లో సీ ఆరోగ్యస్వామి అనే కస్టమర్ రూ. 2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే, దాంట్లో హోటల్ బాలమురుగన్ ‘పికిల్’ ఇవ్వలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.
Read Also: UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇటీవల తమిళనాడులోని విల్లుపురం న్యాయస్థానం రూ.2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్లో భాగంగా ఉన్న ఊరగాయను డెలివరీ చేయనందుకు పరిహారంతో పాటు కేసు కోసం బాధితుడికి అయిన ఖర్చులతో కలిపి రూ. 35,000 చెల్లించాలని రెస్టారెంట్ యజమానిని ఆదేశించింది. ఆరోగ్యస్వామి తన బంధువు మరణించి ఏడాది కావడంతో 25 మందికి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే, అందులో ఊరగాయ ఇవ్వలేదు. రెస్టారెంట్ సర్వీస్ లోపాలకు సమానమని, ఇది కస్టమర్కి శారీరక కష్టాల్ని, మానసిక వేదనని మిగిల్చిందని కోర్టు పేర్కొంది. బాధిత కస్టమర్ కొనుగోలు చేసిన 25 భోజనాలకు రసీదు కూడా ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.
ఈ కేసులో న్యాయస్థానం రెస్టారెంట్కి రూ. 5000 న్యాయపరమైన ఖర్చులతో పాటు రూ. 30,000 జరిమానా విధించింది. ప్రతీ భోజన పార్సిల్లో వైట్ రైస్, సాంబార్, కూర, రసం, మజ్జిగ, కూట్టు, పొరియాల్, అప్పలం, ఊరగాయ, పెద్ద సైజు అరటి ఆకులు మరియు కవర్ ఉంటాయని హోటల్ ముందుగా చెప్పింది. ఒక్కో పార్సిల్కి రూ. 80 వసూలు చేసింది. అయితే, భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో తనకు అవమానం ఎదురైందని కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊరగాయ వచ్చే సమయానికి అతిథులందరూ తమ భోజనం ముగించాని ఫిర్యాదులో వెల్లడించారు.
- Tags
- Consumer Court
- Food
- Tamil Nadu
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!