26/11 Mumbai Attacks: “భారతీయుల హత్యకు బాధ్యత”.. లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ప్రకటించిన ఇజ్రాయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
‘‘ భారత ప్రభుత్వం తమను నిషేధించమని కోరనప్పటికీ.. ఇజ్రాయిల్ అధికారికంగా అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది. లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థల జాబితాలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి’’ అని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘ లష్కరే తోయిబా ఒక ఘోరమైన, ఖండించదగిన ఉగ్రవాద సంస్థ, ఇది వందలాది మంది భారతీయులు పౌరులతో పాటు ఇతరుల హత్యలకు కారణమైంది. నవంబర్ 26, 2008న లష్కరే హేయమైన చర్యలు ఇప్పటికీ శాంతి కోరుకునే దేశాలు, సమాజాల ద్వారా ప్రతిధ్వనిస్తున్నాయి’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
Read Also: WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్ ఫిల్టరింగ్ ఫీచర్ బెనిఫిట్స్ ఇవే..!
ముంబై దాడుల్లో అనేక మంది విదేశీ పౌరులతో పాటు 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు ముంబై తీరానికి చేరుకుని నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ప్రముఖ లియోపోల్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు మరియు ఒక థియేటర్తో సహా వివిధ ప్రదేశాలలో పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. నారీమన్ హౌజ్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటళ్లలో వేలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు యూదులు ఉన్నారు. వీరంతా నారిమన్ హౌస్ లో హత్యకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇండియాలో ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ మాట్లాడుతూ.. భారత్ హమాస్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని కోరారు.
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..