రాష్ట్రంలో రక్షణ కరువయిందని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నాప్ లు, హత్యలు మామూలు అయిపోయాయని, ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె అన్నారు. వేల మంది రైతులు నా దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంన్నారని, ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని ఆమె అన్నారు. దీంతో రియల ఎస్టేట్ మాఫియా రైతులపై దౌర్జన్యం చేస్తుందన్నారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. టెక్నాలజీ మంచిదే కానీ అదే టెక్నాలజీ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని, ఇలా అయితే అందరూ కిడ్నాప్ల, మర్డర్ లు చేస్తారన్నారు.
గతంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు కూడా తప్పుల తడకే…అధికారులు ఏం చేస్తున్నారని ఆమె అన్నారు. అమరావతి రైతులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.. అమరావతి లో న్యాయం గెలిచింది.. రైతుల పోరాటం తోనే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు. మహిళలకు సైతం ఈ పోరాటంలో గట్టి పోరాట పటిమ చూపించారని ఆమె అన్నారు. రైతుల పాదయాత్రతో దేవుడు కరుణించాడని, తిరుమల వెంకన్న, కనకదుర్గ ఆశీస్సులు అమరావతి రైతులకు ఉన్నాయన్నారు. అమరావతిపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, రైతుల పోరాటంకు కోర్ట్ తీర్పుతో సరైన న్యాయం జరిగిందని, ప్రభుత్వం ఈ తీర్పు పై అప్పీల్ కు వెళితే .. రైతుల తరుపున మేము కూడా అప్పీల్ కు వెళతామన్నారు.