Reasi bus attack: రియాసి బస్ అటాక్.. ఎన్ఐఏ సోదాల్లో కీలక విషయాలు..
- రియాసి బస్సు అటాక్ కేసులో ఎన్ఐఏ విచారణ..
- రాజౌరీలో పలు ప్రాంతాల్లో సోదాలు..
- టెర్రరిస్టులతో పలువురు స్థానికులతో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ కేసును జూన్ 15న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. రియాసి జిల్లాలోని శివ్ ఖోరి నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఈ కేసులో హైబ్రీడ్ ఉగ్రవాదులకు స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరితో సంబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. అరెస్టైన టెర్రరిస్ట్ హకమ్ ఖాన్ దాడికి సంబంధించిన లొకేషన్లను కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు చూపించాడు. జూన్ 9న జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులకు హకమ్ సురక్షిత ఆశ్రయం, లాజిస్టిక్, ఆహారాన్ని అందించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి గురైన యాత్రికుల్లో ఎక్కువ మంది రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చారు.
సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులకు, స్థానికంగా ఉగ్రవాద సానుభూతిపరులుగా ఉన్న వారికి మధ్య సంబంధాలను చూపించే కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 50 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులో ఉన్నారు. పూంచ్లో మే 4న భారత వైమానిక దళ కన్వాయ్పై దాడి చేసిన అదే పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ దాడిలో కూడా పాల్గొన్నట్లు ఇంటెజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ దాడికి ముందుగా లష్కరేతోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత ప్రకటించుకుంది. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?