AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert: ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రేపు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ తీవ్రవాయుగుండం ఛత్తీస్గఢ్–మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశముందని వెల్లడించింది. తీవ్రవాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాల వారీగా చూస్తే పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
Also Read
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
ఇక, గత 24 గంటల్లో అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడులో 67.2 మి.మీ., పెనమలూరులో 64.6 మి.మీ., అయినవిల్లిలో 62.8 మి.మీ., పోడూరులో 60.4 మి.మీ., పి.గన్నవరంలో 58 మి.మీ., కలిదిండిలో 55.6 మి.మీ., భీమవరంలో 52.6 మి.మీ., ముదినేపల్లిలో 52.4 మి.మీ., ముమ్మడివరంలో 50.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు..
ప్రజలు ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్న సమయంలో చిన్న పడవలతో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచిస్తూ, వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Trump: ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
-
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
-
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
-
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Voters List: తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.. మీ ఓటు లేకపోతే ఇలా చేయండి..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!