Ravi Shankar Prasad: మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారు.. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ ఫలించదని అన్నారు.
Read Also: Valentine Day: బిడ్డా, నీకు లవ్ కావాల్నా.. చెప్పుతో పెళ్లి చేసిన తల్లి
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్నే నిర్వహించలేకపోతున్నారని.. తనను ప్రధాని అభ్యర్థిగా చేయాలని అందర్ని నితీష్ కుమార్ వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశం మారింది, ప్రజలు మారారు.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారని..నితీష్ కుమార్ రాజకీయ విశ్వసనీయతనను పెంచుకోలేకపోతున్నారని విమర్శించారు. బీహార్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని.. ఆయన పార్టీ గందరగోళంలో ఉంది.. కాంగ్రెస్ ఆయనకు ఏమాత్రం సపోర్టు ఇవ్వడం లేదు.. నితీష్ జీ మీరు దేవేగౌడ, ఐకే గుజ్రాల్ గా మారాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
గత నెలలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ బీహార్ ను 17 ఏళ్లుగా అభివృద్ధి చేయలేకపోయారని.. ఇందుకు ఆయన సమాధాన్ యాత్రే సమాధానం అని అన్నారు. గతంలో కేసీఆర్ బీహార్ కు వచ్చినప్పుడున తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నితీష్ అనుకున్నారని.. అలాగే కేసీఆర్ కూడా అనుకున్నారని సెటైర్లు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కాంగ్రెస్ తో కలిసినా ప్రయోజనం లేదని అన్నారు.
- Tags
- bihar
- congress
- JDU
- nitish kumar
- PM Modi
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..