Ranya Rao: వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. భలే కట్టుకథ అల్లిందే?
- వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం
- యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నట్లు వెల్లడి
- కట్టుకథ అల్లినట్లుందే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావుకు సంబంధించిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బెయిల్ పిటిషన్పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఎదుట అధికారులు ఉంచారు.
ఇది కూడా చదవండి: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నట్లు తెలిపింది. దుబాయ్ ఎయిర్పోర్టులో ఉండగా ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని.. బంగారాన్ని బెంగళూరు డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులకు తెలిపింది. రెండు ప్లా్స్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని.. దాన్ని దాచేందుకు బ్యాండేజ్లు, కత్తెర సమీపంలో ఉన్న స్టేషనరీలో కొనుగోలు చేసినట్లు తెలిపింది. రెస్ట్రూమ్కు వెళ్లి బంగారం బిస్కెట్లను అతికించుకున్నట్లు తెలిపింది. ఇదంతా యూట్యూబ్ చూసే నేర్చుకున్నట్లు వాంగ్మూలంలో తెలిపింది. అయితే బంగారం ఇచ్చిన వ్యక్తి మాత్రం తనకు తెలియదని.. అతడి భాషను బట్టి ఆఫ్రికన్-అమెరికన్లా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇంతకముందు ఎప్పుడు బంగారం తీసుకురాలేదని.. ఇదే తొలిసారి అని పేర్కొంది. బెంగళూరు ఎయిర్పోర్టులోంచి బయటకు వచ్చాక.. ఒక ఆటోలో పెట్టేసి వెళ్లిపోవాలని చెప్పారని అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు తెలిపింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బ్రిటిష్ మహిళా టూరిస్ట్పై అత్యాచారం
మార్చి 3న బెంగళూరు ఎయిర్పోర్టులో రన్యారావు పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలల్లో రన్యారావు దుబాయ్కి 27 ట్రిప్పులు వెళ్లింది. నాలుగు ట్రిప్పులు మాత్రం కేవలం 15 రోజుల వ్యవధిలో జరిగాయి. అయితే వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన డ్రస్ వేసుకుని వెళ్లింది. వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్. అతడి హోదాను ఉపయోగించుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు నెలల క్రితమే జతిన్ హుక్కేరి అనే ఆర్కిటెక్ను రన్యారావు పెళ్లి చేసుకుంది. కానీ అతడితో సంసారం చేయలేదు. తరుచుగా విదేశాలకు వెళ్తూ ఉండేది. ఇక ఆమె పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఖరీదైన బహుబతులు ఇచ్చారు. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వీడియోలు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు..
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!