Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు
- బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్
- పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha Vs Botsa: బుడమేరు బాధితులకు వరద సాయంపై మండలిలో రచ్చ.. మంత్రి అనిత వర్సెస్ బొత్స..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
రన్యారావు.. మొబైల్ డేటాను పరిశీలించగా తరుణ్ రాజుతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రన్యారావుకు ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. కానీ ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ రాజుతో రన్యారావుకు సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. కాల్ డేటా ప్రకారం తరుణ్ రాజుతోనే రన్యారావు సంబంధం కొనసాగించినట్లుగా అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ రవాణాలో తరుణ్ రాజు పాత్ర ప్రముఖంగా తేలింది. ప్రస్తుతం తరుణ్ రాజును లోతుగా విచారిస్తున్నారు. ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: రాజధాని నిర్మాణానికి రూ.64,721.48 కోట్లు ఖర్చు.. మూడేళ్లలో పూర్తి..
ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో రన్యారావును తనిఖీ చేయగా రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె ఇంటి దగ్గర సోదాలు చేయగా కోట్ల రూపాయుల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎక్కువగా తరుణ్ రాజుతో రన్యారావు సంభాషించినట్లుగా కాల్ డేటాను బట్టి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రన్యారావు-తరుణ్ రాజు స్నేహితులుగా కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
గత సంవత్సరంలో రన్యారావు దాదాపు 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చింది. కేవలం 15 రోజుల్లోనే నాలుగు ట్రిప్పులు తిరిగింది. ప్రతి ప్రయాణంలోనూ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని వర్గాలు పేర్కొన్నాయి. అయితే దర్యాప్తును రహస్యంగా ఉంచాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అయితే సోమవారం జడ్జి ముందు ఆమె మాట్లాడుతూ.. తనను కొట్టలేదు గానీ.. మాటలతో హింసిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను డీఆర్ఐ అధికారులు తోసిపుచ్చారు. ఆమె సరైన సమాధానం ఇవ్వడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ప్రతి ప్రశ్నకు మౌనంగా ఉంటుందని జడ్జికి అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: STOP Drinking Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే ఇన్ని సమస్యలా?
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!