CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
Read Also: Kangana Supports CAA: మోడీని మరో సారి ఆకాశానికి ఎత్తిన కంగనా రనౌత్.. సీఏఏకు పూర్తి మద్దతు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కంటే ముందు భారత్కి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు హర్షిస్తున్నారు. రాజస్థాన్ జోధ్పూర్ వారంతా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇది మాకు నిజమైన రామరాజ్యం లాంటిది’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘మేము దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. ఇది (CAA) నిజం కావడంతో, పౌరసత్వం కోసం చూస్తున్న చాలా మంది త్వరలో భారతీయ పౌరులుగా మారాలని ఆశిస్తున్నారు’’ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారు దినేష్ భీల్ అన్నారు. భారత్లో నివసించిన ఆరు ఏళ్ల తర్వాత మేము పౌరసత్వం పొందుతున్నామని మరో వలసదారు పెరుమాళ్ అన్నారు. ఒక్క జోధ్పూర్ లో సుమారు 35,000 మంది వలసదారులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి హిందూ వలసదారుల ప్రవాహం పెరిగింది. పాకిస్తాన్ లోని సింధ్ నుంచి హిందూ వలసదారులు రాజస్థాన్ లోని బార్మర్, బికనేర్, జోధ్పూర్లకు వచ్చి నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!