CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
Read Also: Kangana Supports CAA: మోడీని మరో సారి ఆకాశానికి ఎత్తిన కంగనా రనౌత్.. సీఏఏకు పూర్తి మద్దతు
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కంటే ముందు భారత్కి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు హర్షిస్తున్నారు. రాజస్థాన్ జోధ్పూర్ వారంతా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇది మాకు నిజమైన రామరాజ్యం లాంటిది’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘మేము దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. ఇది (CAA) నిజం కావడంతో, పౌరసత్వం కోసం చూస్తున్న చాలా మంది త్వరలో భారతీయ పౌరులుగా మారాలని ఆశిస్తున్నారు’’ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారు దినేష్ భీల్ అన్నారు. భారత్లో నివసించిన ఆరు ఏళ్ల తర్వాత మేము పౌరసత్వం పొందుతున్నామని మరో వలసదారు పెరుమాళ్ అన్నారు. ఒక్క జోధ్పూర్ లో సుమారు 35,000 మంది వలసదారులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి హిందూ వలసదారుల ప్రవాహం పెరిగింది. పాకిస్తాన్ లోని సింధ్ నుంచి హిందూ వలసదారులు రాజస్థాన్ లోని బార్మర్, బికనేర్, జోధ్పూర్లకు వచ్చి నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!