CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
Read Also: Kangana Supports CAA: మోడీని మరో సారి ఆకాశానికి ఎత్తిన కంగనా రనౌత్.. సీఏఏకు పూర్తి మద్దతు
Also Read
దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కంటే ముందు భారత్కి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు హర్షిస్తున్నారు. రాజస్థాన్ జోధ్పూర్ వారంతా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇది మాకు నిజమైన రామరాజ్యం లాంటిది’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘మేము దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. ఇది (CAA) నిజం కావడంతో, పౌరసత్వం కోసం చూస్తున్న చాలా మంది త్వరలో భారతీయ పౌరులుగా మారాలని ఆశిస్తున్నారు’’ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారు దినేష్ భీల్ అన్నారు. భారత్లో నివసించిన ఆరు ఏళ్ల తర్వాత మేము పౌరసత్వం పొందుతున్నామని మరో వలసదారు పెరుమాళ్ అన్నారు. ఒక్క జోధ్పూర్ లో సుమారు 35,000 మంది వలసదారులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి హిందూ వలసదారుల ప్రవాహం పెరిగింది. పాకిస్తాన్ లోని సింధ్ నుంచి హిందూ వలసదారులు రాజస్థాన్ లోని బార్మర్, బికనేర్, జోధ్పూర్లకు వచ్చి నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!