UP Polls: రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ.. ఉద్యోగాల కోసం నినాదాలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది.. ఇవాళ గోండా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. వెంటనే ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. ఇక, యువత నిరసనపై స్పందించిన రాజ్నాథ్ సింద్.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి శాంతింపజేశారు.. మరోవైపు ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు..
Read Also: Medaram: గిరిజన దేవతల వనప్రవేశం.. ముగిసిన మేడారం జాతర..
Also Read
గోండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. ప్రత్యేకంగా భారత సైన్యంలో ఉద్యోగాలు కోరుతూ స్టాండ్ల నుండి నినాదాలు చేస్తూ అంతరాయం కలిగించారు యువకులు.. వేదికపై ఉన్న మంత్రి, నిరసన గురించి ఆరా తీసి, రిక్రూట్మెంట్లు జరుగుతాయని హామీ ఇచ్చారు. మీ ఆందోళన మాది కూడా.. కరోనావైరస్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వివరించారు.. ఇక, గత వారం ఉత్తరప్రదేశ్లో తన మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది.. మరోవైపు, గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కోట్లాది ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించిందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గతంలో ట్వీట్ చేశారు. ఈ వాదన మైదానంలో తీవ్ర వివాదాస్పదమైంది, ప్రత్యేకించి రాష్ట్రంలోని కోచింగ్ హబ్ ప్రయాగ్రాజ్లో గత నెలలో రైల్వే పరీక్షలో అక్రమాలను నిరసిస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. యూపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు మరియు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో