Rajasthan Political Crisis: కాంగ్రెస్లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు. అక్టోబర్ 19 తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కు సూచిస్తామని ఆయన అన్నారు.
గెహ్లాట్ కు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం ముందు మూడు షరతులు పెట్టారు. గెహ్లాట్ రాజీనామా తర్వాత ఆయన అనుకూల వర్గం నుంచే ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని.. ముఖ్యమంత్రి నియామకం విషయంలో ఆయన సూచనలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విధంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాతే అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు.
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
Read Also: kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
ఇదిలా ఉంటే తరుపరి సీఎం సచిన్ పైలెట్ అని అధిష్టానం తెలియజేయడంతో గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. కాగా.. సచిన్ పైలెట్ కు హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. అయితే తాను ఢిల్లీకి వెళ్లేది లేదని ఆయన తెలిపారు. చర్చల కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్లను ఢిల్లీకి రావాలని హైకమాండ్ కోరింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ తదుపరి సీఎంగా స్పీకర్ సీపీ జోషి, బీడీ కల్లా పేర్లను సూచించారు.
రాజస్థాన్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ఈ గొడవలను చక్కదిద్దే పనిలో పడ్డారు కాంగ్రెస్ నాయకులు. కాసేపట్లో సోనియాగాంధీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వివాదం తాాజాగా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య వివాదం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!