Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు వదులుకోవాల్సిందే.
ఇదిలా ఉంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి వదులుకుంటే.. తదుపరి రాజస్థాన్ సీఎం సచిన్ పైలెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అశోక్ గెహ్లాట్ ఇంట్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వంపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని తీర్మానం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
Read Also: India vs Australia T20 Match: డూ ఆర్ డై ఫైట్.. ఉప్పల్ వేదికగా నేడు కీలక మ్యాచ్..
ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్ తో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఆదివారం కాంగ్రెస్ మీటింగ్ జరగడానికి ముందే శనివారం అజయ్ మాకెన్, సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. రాజస్థాన్ పరిణామాలను అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పరిశీలిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇదిలా ఉంటే సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. కాగా.. సచిన్ పైలెట్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచిన్ పైలెట్ కాకుండా.. స్పీకర్ జోషిని ముఖ్యమంత్రిని చేయాలని అశోక్ గెహ్లాట్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది పోటీ చేసే అవకాశం ఉంది. 1998 తరువాత తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!