Congress: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీల వర్షం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఇంకెన్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ ప్రజలకు గాంధీ అనేక వాగ్దానాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక హామలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలివే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
1. రూ.500కే గ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం
3. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
4. రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ
5. 3000 ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు
6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
7. పాల ఉత్పత్తిదారులకు లీటరుపై రూ.5 సబ్సిడీ
8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
తాము గుజరాత్ ప్రజల కోసం పని చేస్తామని.. బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే కాంగ్రెస్ సంకల్పమని.. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుంది, అయితే వారు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రతి రైతుకు రూ.3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. గుజరాత్లో మేం అధికారంలోకి వస్తాం. ” అని రాహుల్ అన్నారు. గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారిందని.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ సోమవారం మండిపడ్డారు. ‘గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారింది. ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ను తరలిస్తారు కానీ మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. ఇది గుజరాత్ మోడల్.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
7. दुग्ध उत्पादकों को 1 लीटर पर ₹5 की सब्सिडी
8. सरकारी नौकरियों में कांट्रैक्ट सिस्टम बंद और युवाओं के लिए ₹3000 का बेरोज़गारी भत्ताहम गुजरात की जनता के लिए काम करेंगे, भाजपा की तरह 2-3 'मित्रों' के लिए नहीं।
ये हमारा संकल्प है और गुजरात की जनता कांग्रेस को जिताएगी।
— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2022
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..