Congress: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీల వర్షం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఇంకెన్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ ప్రజలకు గాంధీ అనేక వాగ్దానాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక హామలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలివే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
1. రూ.500కే గ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం
3. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
4. రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ
5. 3000 ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు
6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
7. పాల ఉత్పత్తిదారులకు లీటరుపై రూ.5 సబ్సిడీ
8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
తాము గుజరాత్ ప్రజల కోసం పని చేస్తామని.. బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే కాంగ్రెస్ సంకల్పమని.. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుంది, అయితే వారు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రతి రైతుకు రూ.3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. గుజరాత్లో మేం అధికారంలోకి వస్తాం. ” అని రాహుల్ అన్నారు. గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారిందని.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ సోమవారం మండిపడ్డారు. ‘గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారింది. ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ను తరలిస్తారు కానీ మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. ఇది గుజరాత్ మోడల్.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
7. दुग्ध उत्पादकों को 1 लीटर पर ₹5 की सब्सिडी
8. सरकारी नौकरियों में कांट्रैक्ट सिस्टम बंद और युवाओं के लिए ₹3000 का बेरोज़गारी भत्ताहम गुजरात की जनता के लिए काम करेंगे, भाजपा की तरह 2-3 'मित्रों' के लिए नहीं।
ये हमारा संकल्प है और गुजरात की जनता कांग्रेस को जिताएगी।
— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2022
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!