Rahul Gandhi: భారతదేశంలో నిరుద్యోగం పాకిస్తాన్ కన్నా ఎక్కువగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత రేటు చేరుకుందని, పాకిస్తాన్తో పోలిస్తే భారత్లో రెండింతల నిరుద్యోగిత ఉందని అన్నారు.
Read Also: Pakistan: సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని పాకిస్తాన్ తీర్మానం..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఆర్థిక అసమానతలు, యువత, రైతుల పరిస్థితిని గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిరుద్యోగ పెరుగుదలకు కారణమని అన్నాడు. కేంద్ర ప్రభుత్వం రైతుల కంటే పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల రుణమాఫీని విస్మరిస్తూ, కొందరు పారిశ్రామికవేత్తలకు భారీ రుణమాఫీని ఇవ్వడాన్ని విమర్శించారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం.. 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ నిరుద్యోగిత రేటు 8.5 శాతం కాగా.. భారత నిరుద్యోగిత రేటు 3.2 శాతంగా నమోదైంది.
లోక్సభ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ని ప్రారంభించింది. మణిపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రాలను చుడుతూ బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ మీదుగా ముంబైలో పూర్తి కాననుంది. శనివారం మధ్యాహ్నం మొరెనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది. 15 రాష్ట్రాల్లో 6700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!