Rahul Jodo Yatra: ఝలక్ ఇచ్చిన భద్రతా సిబ్బంది.. జోడో యాత్ర నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Bharat Jodo Yatra Stops In Jammu and Kashmir Due To Security Lapse: భద్రతా సిబ్బంది ఇచ్చిన ఝలక్ మేరకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను జమ్ముకశ్మీర్లో తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. యాత్ర మార్గంలో భారీ జన సమూహాల్ని నియంత్రించడంలో భద్రతా సిబ్బంది విఫలమైంది. స్థానిక పోలీసులు సైతం మాయం అవ్వడంతో.. యాత్రను అర్థాంతరంగా ఆపేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక యంత్రాంగం వైఫల్యం వల్లే యాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది ఇచ్చిన సూచనల మేరకు.. మేరకు పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Google: హెచ్ఆర్కి ట్విస్ట్ ఇచ్చిన గూగుల్.. ఇంటర్వ్యూ చేస్తుండగానే..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
దీంతో కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారమైన ఖాజీగుండ్ సమీపంలో జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘రాహుల్ గాంధీ బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీగుండ్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. దక్షిణ కశ్మీర్లోని వెస్సు వైపు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. కానీ, బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు ఒక్కసారిగా మాయం అయ్యారు. భారీ జనసమూహాలను నియంత్రించడంలోనూ లోపాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితిలో పాదయాత్ర చేయడం కుదరదని రాహుల్ సెక్యూరిటీ సూచించింది. దీంతో పాదయాత్రను ఆపేసి.. రాహుల్ గాంధీ ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక వద్దకు వెళ్లారు’’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు
కాగా.. శుక్రవారం నాడు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. భద్రతా లోపం కారణంగా కిలోమీటర్లోపే నిలిపేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా.. భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ జమ్మూ-కశ్మీర్ ఇన్ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం స్పందిస్తూ.. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..