Rahul Jodo Yatra: ఝలక్ ఇచ్చిన భద్రతా సిబ్బంది.. జోడో యాత్ర నిలిపివేత
Rahul Gandhi Bharat Jodo Yatra Stops In Jammu and Kashmir Due To Security Lapse: భద్రతా సిబ్బంది ఇచ్చిన ఝలక్ మేరకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను జమ్ముకశ్మీర్లో తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. యాత్ర మార్గంలో భారీ జన సమూహాల్ని నియంత్రించడంలో భద్రతా సిబ్బంది విఫలమైంది. స్థానిక పోలీసులు సైతం మాయం అవ్వడంతో.. యాత్రను అర్థాంతరంగా ఆపేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక యంత్రాంగం వైఫల్యం వల్లే యాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది ఇచ్చిన సూచనల మేరకు.. మేరకు పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Google: హెచ్ఆర్కి ట్విస్ట్ ఇచ్చిన గూగుల్.. ఇంటర్వ్యూ చేస్తుండగానే..
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
దీంతో కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారమైన ఖాజీగుండ్ సమీపంలో జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘రాహుల్ గాంధీ బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీగుండ్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. దక్షిణ కశ్మీర్లోని వెస్సు వైపు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. కానీ, బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు ఒక్కసారిగా మాయం అయ్యారు. భారీ జనసమూహాలను నియంత్రించడంలోనూ లోపాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితిలో పాదయాత్ర చేయడం కుదరదని రాహుల్ సెక్యూరిటీ సూచించింది. దీంతో పాదయాత్రను ఆపేసి.. రాహుల్ గాంధీ ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక వద్దకు వెళ్లారు’’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు
కాగా.. శుక్రవారం నాడు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. భద్రతా లోపం కారణంగా కిలోమీటర్లోపే నిలిపేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా.. భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ జమ్మూ-కశ్మీర్ ఇన్ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం స్పందిస్తూ.. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!