NIA: భారత ఎంబసీలపై దాడి చేసిన 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరిని ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది.
హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ లో అమెరికా, కెనడా, యూకేల్లో భారత దౌత్యకార్యాలయాపై దాడులకు సంబంధించిన కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 50 వరకు ఎన్ఐఏ రైడ్స్ చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వ్యక్తులను విచారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి, జూలై నెలల్లో దౌత్యకార్యాలయాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. మార్చి 19న లండన్లోని ఎంబసీపై ఖలిస్తానీ వర్గాలు రెండుసార్లు దాడులు చేశాయి. జూలై 2న అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులే జరిగాయి.
Also Read
Read Also: Jammu Kashmir: ఉగ్రవాదంపై సమాచారం ఇస్తే భారీ నజరానా.. రూ.1 లక్ష నుంచి రూ.12.50 లక్షల రివార్డ్..
ఈ రెండు దాడులపై నేరపూరిత అతిక్రమణ, అనాగరికత, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, రాయబార కార్యాలయ సిబ్బందికి హాని కలిగించడం, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ హింసాత్మక ఘటనల్లో మరింత సమాచారం సేకరించడానికి ఆగస్టులో ఎన్ఐఏ అధికారులు అమెరికా వెళ్లారు. మరోవైపు మార్చి 2023 కెనడా, శాన్ఫ్రాన్సిస్కో దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కెనడాలో భారత హైకమిషన్ వద్ద నిరసన సందర్భంగా ఏకంగా గ్రెనేడ్ విసిరారు. ఈ ఏడాది జూన్ నెలలో లండన్లో జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు ఎన్ఐఏ ప్రజల సాయాన్ని కోరింది.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!