Plane Crash: యూపీలో విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా కూలిన ప్రైవేటు విమానం
- యూపీలో విమాన ప్రమాదం
- టేకాఫ్ అవుతుండగా కూలిన ప్రైవేటు విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో విమాన ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోతోందా ? రాలడాన్ని ఆపే అద్భుత మార్గాలు ఇవే..
Also Read
- Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
గురువారం ఉదయం ఫరూఖాబాద్లోని మొహమ్మదాబాద్ ఎయిర్స్ట్రిప్ దగ్గర ఒక ప్రైవేట్ విమానం రన్వేపై నుంచి జారిపడి సరిహద్దు గోడకు కొద్ది దూరంలో ఆగిపోయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానంలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Jaish-e-Mohammad New Strategy: జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్!
జెట్సర్వ్ ఏవియేషన్కు చెందిన విమానం ఉదయం 11:15 గంటలకు టేకాఫ్ అవుతుండగా రన్వేపై నుంచి దాదాపు 400 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా దిశ తప్పింది. అలైన్మెంట్ కోల్పోయి గోడ దగ్గర ఆగిపోయింది. అధికారుల నివేదిక ప్రకారం.. విమానం ట్విన్-ఇంజన్ చార్టర్ భోపాల్కు బయలుదేరాల్సి ఉంది. సంఘటన జరిగిన సమయంలో పైలట్లు నసీబ్ బామన్, ప్రతీక్ ఫెర్నాండెజ్ ఉన్నట్లు తెలిపారు. ఖిమ్సేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో బీర్ తయారీ యూనిట్ను అంచనా వేసేందుకు ఒక బృందంతో వచ్చిన వుడ్పెకర్ గ్రీన్ అగ్రి న్యూట్రిప్యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అరోరా, ఎస్బీఐ నుంచి సుమిత్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ టిక్కు, యూపీ ప్రాజెక్ట్ హెడ్ మనీష్ పాండే విమానంలో ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు.
విమాన చక్రాల్లో ఒక దాంట్లో గాలి పీడనం తక్కువగా ఉండడంతో రన్వే నుంచి పక్కకు తప్పినట్లు సమాచారం. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముందు జాగ్రత్తగా చేరుకున్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!