Jaish-e-Mohammad New Strategy: జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్!
- ముస్లిం మహిళలను టార్గెట్ చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ..
- ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో మహిళలకు ఎరా..
- విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు..
Jaish-e-Mohammad New Strategy: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సరికొత్త వ్యూహాం అమలు చేస్తుంది. భావోద్వేగ, మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు చేసిందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో పాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు. రోజువారీ ప్రార్థనలు, దాతృత్వం, “హిజాబ్” ద్వారా ముస్లిం మతానికి సేవ చేయాలని జమాతుల్-ముమినాత్ పిలుపునిస్తూ మహిళలను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద నెట్వర్క్లోకి చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, 2004 నుంచి చురుకుగా ఉన్న ఈ సంస్థ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని అనుమానాస్పద మహిళలను లక్ష్యంగా చేసుకుంటోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉగ్ర సంస్థ వాట్సాప్, టెలిగ్రామ్, మదర్సా నెట్వర్క్ల ద్వారా చిన్న గ్రూపులుగా విడిపోయి పని చేస్తుందన్నారు. ఈ సంస్థ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలకు గల ఆధారాలు సైతం కూడా కనుగొనబడ్డాయి.
Read Also: Niharika NM : నాకు ‘తేడా’ కథలు ఇష్టం.. అందుకే ‘పెరుసు’ చేశా!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
స్త్రీల బ్రెయిన్ వాష్ ఎలా జరుగుతుంది?
ఈ ఉగ్ర గ్రూపులు విద్యావంతులైన ముస్లిం మహిళలను ఆకర్షించడానికి మతపరమైన, భావోద్వేగపరమైన ప్రసంగాలను ఉపయోగిస్తాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ప్రచారం ఎక్కువగా నిర్వహించబడుతోంది. మహిళల నియామకాలను సులభతరం చేయడానికి “విశ్వాస సేవ”, “ఇఖ్లాస్” “నిజామ్-ఎ-షరియత్” లాంటి మతపరమైన పరిభాషలతో పాటు “ఈ వ్యవస్థ అల్లాహ్ ఇచ్చినది” “ఈ వెలుగు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది” వంటి భావోద్వేగ విజ్ఞప్తిని ఈ మహిళలను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారు. సంస్థ కార్యకలాపాలను “ఆశీర్వాదం”, “కరుణ” మరియు “రక్షణ”గా ప్రదర్శిస్తారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత దాడులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరియు పంజాబ్ ప్రావిన్సులలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) కు చెందిన కనీసం తొమ్మిది ప్రధాన ఉగ్రవాద కేంద్రాలను తుడిచిపెట్టాయి .
Read Also: Shiva: రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలియదు.. కానీ ‘శివ’ నా దృష్టి మార్చేసింది: శేఖర్ కమ్ముల
దాడి జరిగినప్పటి నుండి, ఈ ఉగ్రవాద సంస్థలు, పునరుద్ధరించిన నిధులతో, భవిష్యత్తులో భారత ఖచ్చితమైన దాడులను తప్పించుకునే ప్రయత్నంలో, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కఠినమైన భూభాగాలకు తమ స్థావరాలను రహస్యంగా మారుస్తున్నాయని ఇండియా టుడే టీవీకి తెలిసింది. కొత్త ఉగ్రవాద శిబిరాలు సరిహద్దు మరియు నియంత్రణ రేఖ (LOC) నుండి గణనీయమైన దూరంలో ఉన్నప్పటికీ, అవి ఎప్పటికీ తగినంత దూరంలో లేవని మరియు అవసరమైతే ప్రతీకారం నుండి తప్పించుకోలేవని భారత సైనిక వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి. గత వారం, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇస్లామాబాద్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ ఉంటే ప్రపంచ పటం నుండి తొలగించబడుతుందని హెచ్చరించారు .
Read Also: Minister Kollu Ravindra: నకిలీ మద్యం తయారీ కేసు.. కీలక అంశాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర..
ఈ ఉగ్ర గ్రూపులు విద్యావంతులైన ముస్లిం మహిళలను ఆకర్షించడానికి మతపరమైన, భావోద్వేగపరమైన ప్రసంగాలను ఉపయోగిస్తాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలను టార్గెట్ చేసుకుని దీంట్లోకి దించుతున్నట్లు తేలింది. అయితే, మహిళల నియామకాల్ని సులభతరం చేయడానికి “విశ్వాస్ సేవ”, “ఇఖ్లాస్”, “నిజామ్-ఎ-షరియత్” వంటి మతపరమైన పరిభాషలతో పాటు “ఈ వ్యవస్థ అల్లాహ్ ఇచ్చినది”, “ఈ వెలుగు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది” వంటి భావోద్వేగ ప్రసంగాలతో వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పంజాబ్ ప్రావిన్సుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కనీసం తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే, భారత్ దాడి చేసినప్పటి నుంచి ఈ ఉగ్రవాద సంస్థలు పునరుద్ధరించిన నిధులతో భవిష్యత్లో భారత్ చేసే ఖచ్చితమైన దాడులను తప్పించుకోవడానికి పాకిస్థాన్– ఆఫ్గనిస్తాన్ సరిహద్దులోని గుప్త ప్రాంతాలకు తమ స్థావరాలను రహస్యంగా మారుస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!