5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G India Rollout: దేశంలో అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొదటి విడతలో 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దశల వారీగా మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మార్చి, 2023 నాటికల్లా దేశంలోని 200 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇప్పటికే రిలియన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థలు పలు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. రిలియన్స్ జియో మొదటగా 5జీ సేవలను ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి నగరాల్లో ప్రారంభించింది. ఎయిర్ టెల్ సంస్థ ముంబై, బెంగళూరు, సిలిగురి, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, వారణాసి, చెన్నై నగరాల్లో 5జీ సర్వీసులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ నగరాల్లో 5జీని తీసుకువచ్చేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ఇప్పటి వరకు ఏ నగరంలోనూ 5 జీ సేవలను పాటించలేదు.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
Read Also: Green Crackers : గ్రీన్ క్రాకర్స్తో మీ పిల్లల ఆరోగ్యం భ్రదం.. దీపావళికి వీటినే కొనండి..
త్వరలోనే జియో తన 5 జీ సేవలను బెంగళూర్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్ నగర్, చెన్నై, లక్నో, పూణే నగరాల్లో అందించనుంది. ఇక ఎయిర్ టెల్ అహ్మదాబాద్, గాంధీనగర్, గురుగ్రామ్, పూణే, జామ్ నగర్, చండీగఢ్ లో 5 జీ సేవలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.
5జీలో గరిష్టంగా 20 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. ప్రస్తుతం 4జీలో 1 జీబీపీఎస్ వేగాన్ని పొందుతున్నాము. అయితే ప్రస్తుతం 5జీని పొందాలంటే కొత్తగా 5జీ సిమ్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లు 5జీని సపోర్ట్ చేస్తే చాలు. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. సామ్ సంగ్ తమ 5జీ ఫోన్లు నవంబర్ నాటికి 5జీని సపోర్ట్ చేస్తాయని తెలిపింది. ఆపిల్ కూడా డిసెంబర్ నాటికి 5జీ సాఫ్ట్వేర్ అప్ డేట్ విడుదల చేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!