PM Modi: శశిథరూర్ నా పక్కన నిలబడడంతో నిద్రపట్టదేమో.. కాంగ్రెస్పై మోడీ సెటైర్
- మోడీ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్
- కొందరికి నిద్రపట్టదేమో.. కాంగ్రెస్పై మోడీ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు. బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. శశిథరూర్ సభా వేదికపైన కూర్చున్నారు. ఈ కార్యక్రమం చూసిన కొంత మందికి నిద్రకు భంగం కలిగిస్తుందని కాంగ్రెస్ను ఉద్దేశించి మోడీ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధాని మోడీని శశిథరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Air India: ఉద్రిక్తతల కారణంగా ఎయిరిండియాకు రూ.5 వేల కోట్ల నష్టం!
గత కొద్ది రోజులుగా శశిథరూర్ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ పెద్దలతో కలిసి తిరుగుతున్నారు. తన అవసరం లేకపోతే చెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ను శశిథరూర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కాషాయ గూటికి చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మోడీతో కలిసి ఉండడంతో శశిథరూర్ వార్త హల్చల్ చేస్తోంది.
తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విజింజం ఇంటర్నేషనల్ డీప్వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర నేతలంతా పాల్గొన్నారు.
Despite delays at the dysfunctional Delhi airport, managed to land in Thiruvananthapuram in time to receive Prime Minister Narendra Modi on his arrival in my constituency. Looking forward to his officially commissioning Vizhinjam port, a project I have been proud to have been… pic.twitter.com/OoGHeS0Gbe
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2025
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!