PM Modi: శశిథరూర్ నా పక్కన నిలబడడంతో నిద్రపట్టదేమో.. కాంగ్రెస్పై మోడీ సెటైర్
- మోడీ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్
- కొందరికి నిద్రపట్టదేమో.. కాంగ్రెస్పై మోడీ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు. బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. శశిథరూర్ సభా వేదికపైన కూర్చున్నారు. ఈ కార్యక్రమం చూసిన కొంత మందికి నిద్రకు భంగం కలిగిస్తుందని కాంగ్రెస్ను ఉద్దేశించి మోడీ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధాని మోడీని శశిథరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Air India: ఉద్రిక్తతల కారణంగా ఎయిరిండియాకు రూ.5 వేల కోట్ల నష్టం!
గత కొద్ది రోజులుగా శశిథరూర్ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ పెద్దలతో కలిసి తిరుగుతున్నారు. తన అవసరం లేకపోతే చెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ను శశిథరూర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కాషాయ గూటికి చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మోడీతో కలిసి ఉండడంతో శశిథరూర్ వార్త హల్చల్ చేస్తోంది.
తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విజింజం ఇంటర్నేషనల్ డీప్వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర నేతలంతా పాల్గొన్నారు.
Despite delays at the dysfunctional Delhi airport, managed to land in Thiruvananthapuram in time to receive Prime Minister Narendra Modi on his arrival in my constituency. Looking forward to his officially commissioning Vizhinjam port, a project I have been proud to have been… pic.twitter.com/OoGHeS0Gbe
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!