AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!
- గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్నవారిని సైతం కాటికి పంపిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు మరీ ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.. తాజాగా, గుంటూరు జిల్లాలోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత.. అయితే, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో సంచనల అంశాలు వెలుగు చూశాయి..
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఈ కేసులో తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు వెల్లడించిన విషయాల్లోకి వెళ్తే.. గత నెల 26న తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో పృథ్వీరాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు.. అయితే, ఐదేళ్ల క్రితం వెంకటలక్ష్మితో పృధ్వీరాజ్ కు వివాహం జరిగింది.. వెంకటలక్ష్మికి మొదటి భర్త చనిపోవడంతో పృధ్వీరాజ్ తో రెండోపెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.. ఇక, ఉపాధి కోసం బెంగుళూరు వెళ్లారు దంపతులు. అయితే, బెంగుళూరులో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. మరోవైపు, కొన్నిరోజుల బెంగుళూరులో ఉండలేక తెనాలి వచ్చి ఆటోనడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు పృథ్వీరాజ్.. కానీ, కొన్నాళ్లపాటు బెంగుళూరులో కోటేశ్వరరావుతోనే ఉండిపోయింది వెంకటలక్ష్మి. మద్యంతాగి కొడుతుండడంతో తిరిగి భర్త వద్దకు వచ్చింది..
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీకి కృతజ్ఞతాపూర్వక స్వాగతం..
అయితే, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేస్తే.. తమకు అడ్డుఉండదని కోటేశ్వరరావుతో కలిసి ప్లాన్ చేసింది వెంకటలక్ష్మి.. తమ ప్లాన్లో భాగంగా కోటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్య అంటూ భర్త పృథ్వీరాజ్కు పరిచయం చేసింది వెంకటలక్ష్మి.. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి ప్రణాళికలు వేశారు.. తెనాలి వచ్చి మద్యం తాగుదామంటూ పృథ్వీరాజ్ ను బయటకు తీసుకెళ్లిన కోటేశ్వరరావు.. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత కత్తితో పొడిచి.. రాయితో తలపై కొట్టి హత్య చేశాడు.. మొదట హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.. ఇదే సమయంలో.. పృథ్వీరాజ్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. కోడలిపైనే అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు పృథ్వీరాజ్ తండ్రి.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.. తనదైన స్టైల్లో విచారణ జరపగా.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!