AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!
- గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్నవారిని సైతం కాటికి పంపిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు మరీ ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.. తాజాగా, గుంటూరు జిల్లాలోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత.. అయితే, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో సంచనల అంశాలు వెలుగు చూశాయి..
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
ఈ కేసులో తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు వెల్లడించిన విషయాల్లోకి వెళ్తే.. గత నెల 26న తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో పృథ్వీరాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు.. అయితే, ఐదేళ్ల క్రితం వెంకటలక్ష్మితో పృధ్వీరాజ్ కు వివాహం జరిగింది.. వెంకటలక్ష్మికి మొదటి భర్త చనిపోవడంతో పృధ్వీరాజ్ తో రెండోపెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.. ఇక, ఉపాధి కోసం బెంగుళూరు వెళ్లారు దంపతులు. అయితే, బెంగుళూరులో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. మరోవైపు, కొన్నిరోజుల బెంగుళూరులో ఉండలేక తెనాలి వచ్చి ఆటోనడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు పృథ్వీరాజ్.. కానీ, కొన్నాళ్లపాటు బెంగుళూరులో కోటేశ్వరరావుతోనే ఉండిపోయింది వెంకటలక్ష్మి. మద్యంతాగి కొడుతుండడంతో తిరిగి భర్త వద్దకు వచ్చింది..
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీకి కృతజ్ఞతాపూర్వక స్వాగతం..
అయితే, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేస్తే.. తమకు అడ్డుఉండదని కోటేశ్వరరావుతో కలిసి ప్లాన్ చేసింది వెంకటలక్ష్మి.. తమ ప్లాన్లో భాగంగా కోటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్య అంటూ భర్త పృథ్వీరాజ్కు పరిచయం చేసింది వెంకటలక్ష్మి.. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి ప్రణాళికలు వేశారు.. తెనాలి వచ్చి మద్యం తాగుదామంటూ పృథ్వీరాజ్ ను బయటకు తీసుకెళ్లిన కోటేశ్వరరావు.. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత కత్తితో పొడిచి.. రాయితో తలపై కొట్టి హత్య చేశాడు.. మొదట హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.. ఇదే సమయంలో.. పృథ్వీరాజ్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. కోడలిపైనే అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు పృథ్వీరాజ్ తండ్రి.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.. తనదైన స్టైల్లో విచారణ జరపగా.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
తాజావార్తలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!