PM Modi: కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలు.. అభివృద్ధికి అవరోధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి ప్రభుత్వం నుంచి బీజేపీ కర్ణాటక ప్రజలను కాపాడిందని చెప్పారు.
Read Also: Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
అస్థిర ప్రభుత్వాలతో అభివృద్ధి జరగదని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశాన్ని ప్రపంచం పట్టించుకోలేదని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు. బీజేపీని ఎన్నుకోవాలని కర్ణాటక నిర్ణయించిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా ముఖ్యమైందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రభుత్వం హాయాంలో అభివృద్ధి మందగించిదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి 85 శాతం కమిషన్ తీసుకునే అలవాటు ఉందని, ఆ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని, కేంద్ర నుంచి ఒక రూపాయి పంపిస్తే, క్షేత్రస్థాయికి 15 పైసలు మాత్రమే చేరుతాయని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, కేవలం బీజేపీ మాత్రమే అవినీతిపై చర్యలు తీసుకుంటుందని ప్రధాని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ చేసిందేం లేని, వారికి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, కానీ బీజేపీ మాత్రం రైతుల ఖాతాల్లో రూ.2.5 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిందని తెలిపారు. రైతుల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..