Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచనలం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ది కేరళ స్టొరీ’. ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ మే 5న రిలీజ్ కానుంది. “కేరళలో 32000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఇందులో ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలే ఉంటున్నారు. వీరిని కొంతమంది ఆతంకవాదులు, ప్రేమ పేరుతో మోసం చేసి… మత మార్పిడి తర్వాత దేశం నుంచి బయటకి తీసుకోని వెళ్లి… అక్కడ నుంచి ఇండియాపైకి చెయ్యబోయే తీవ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు” అనే కథతో ‘ది కేరళ స్టొరీ’ సినిమా తెరకెక్కింది. ఇది ఫిక్షనల్ స్టొరీ అయ్యి ఉంటే ఎలాంటి సమస్యా వచ్చేది కాదు కానీ మేకర్స్ “ఇది ఒరిజినల్ స్టొరీ, కేరళ రాష్ట్రంలో నిజంగానే అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇందులో అన్ని మతాలకి చెందిన వారు ఉన్నారు కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం హిందువులే. అమ్మాయిలని మోసం చేసి, ట్రాప్ చేసి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం” అని చెప్తుండడం దగ్గరే అసలు సమస్య వస్తోంది.
మే 5న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘ది కేరళ స్టొరీ’ హాట్ టాపిక్ గా మారింది. కేరళలో అమ్మాయిలు అసలు మిస్ అవ్వట్లేదని ఒక వర్గం, 32000 మంది మిస్ అయ్యే ఛాన్స్ లేదని మరికొందరు, ఇది మన దేశంపైన పాకిస్తానీలు చేస్తున్న కుట్ర అని ది కేరళ స్టొరీ సినిమా నిజం చూపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ది కేరళ స్టొరీ టాపిక్ ఆఫ్ ది నేషన్ గా మారడంతో హీరోయిన్ అదా శర్మ రెస్పాండ్ అయ్యింది… “ఆడపిల్లలు కనిపించకుండా పోవడం దారుణం. కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఏమవుతున్నారు అని మాట్లాడడం మానేసి, అంతమంది అమ్మాయిలు మిస్ అవ్వలేదని కొందరు మాట్లాడడం బాధాకరం. నేను కొంతమంది బాధితులను కలిశాను, వారి బాధని నేను మాటల్లో వివరించలేకపోతున్నాను” అంటూ అదా శర్మ మాట్లాడింది. ఓవరాల్ గా ది కేరళ స్టొరీ సినిమా అయితే ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ గర్ల్స్ మిస్సింగ్ కాన్స్పిరసీ గురించి కేరళ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ది కేరళ స్టొరీ సినిమాని బయటకి రానిస్తారా లేక బాన్ చేస్తారా అనేది చూడాలి.
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
#WATCH | Actress Adah Sharma, who plays the lead in the upcoming #TheKeralaStory, opens up about her character in the film
She says, "…It's horrifying that girls are going missing. What is even scarier is the people who are calling it propaganda or discussing the number. I… pic.twitter.com/UGFJqU3ZnV
— ANI (@ANI) April 30, 2023
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!