Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచనలం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ది కేరళ స్టొరీ’. ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ మే 5న రిలీజ్ కానుంది. “కేరళలో 32000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఇందులో ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలే ఉంటున్నారు. వీరిని కొంతమంది ఆతంకవాదులు, ప్రేమ పేరుతో మోసం చేసి… మత మార్పిడి తర్వాత దేశం నుంచి బయటకి తీసుకోని వెళ్లి… అక్కడ నుంచి ఇండియాపైకి చెయ్యబోయే తీవ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు” అనే కథతో ‘ది కేరళ స్టొరీ’ సినిమా తెరకెక్కింది. ఇది ఫిక్షనల్ స్టొరీ అయ్యి ఉంటే ఎలాంటి సమస్యా వచ్చేది కాదు కానీ మేకర్స్ “ఇది ఒరిజినల్ స్టొరీ, కేరళ రాష్ట్రంలో నిజంగానే అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇందులో అన్ని మతాలకి చెందిన వారు ఉన్నారు కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం హిందువులే. అమ్మాయిలని మోసం చేసి, ట్రాప్ చేసి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం” అని చెప్తుండడం దగ్గరే అసలు సమస్య వస్తోంది.
మే 5న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘ది కేరళ స్టొరీ’ హాట్ టాపిక్ గా మారింది. కేరళలో అమ్మాయిలు అసలు మిస్ అవ్వట్లేదని ఒక వర్గం, 32000 మంది మిస్ అయ్యే ఛాన్స్ లేదని మరికొందరు, ఇది మన దేశంపైన పాకిస్తానీలు చేస్తున్న కుట్ర అని ది కేరళ స్టొరీ సినిమా నిజం చూపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ది కేరళ స్టొరీ టాపిక్ ఆఫ్ ది నేషన్ గా మారడంతో హీరోయిన్ అదా శర్మ రెస్పాండ్ అయ్యింది… “ఆడపిల్లలు కనిపించకుండా పోవడం దారుణం. కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఏమవుతున్నారు అని మాట్లాడడం మానేసి, అంతమంది అమ్మాయిలు మిస్ అవ్వలేదని కొందరు మాట్లాడడం బాధాకరం. నేను కొంతమంది బాధితులను కలిశాను, వారి బాధని నేను మాటల్లో వివరించలేకపోతున్నాను” అంటూ అదా శర్మ మాట్లాడింది. ఓవరాల్ గా ది కేరళ స్టొరీ సినిమా అయితే ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ గర్ల్స్ మిస్సింగ్ కాన్స్పిరసీ గురించి కేరళ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ది కేరళ స్టొరీ సినిమాని బయటకి రానిస్తారా లేక బాన్ చేస్తారా అనేది చూడాలి.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
#WATCH | Actress Adah Sharma, who plays the lead in the upcoming #TheKeralaStory, opens up about her character in the film
She says, "…It's horrifying that girls are going missing. What is even scarier is the people who are calling it propaganda or discussing the number. I… pic.twitter.com/UGFJqU3ZnV
— ANI (@ANI) April 30, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!