President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు.. భావోద్వేగ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
president Ram Nath Kovind’s farewell ceremony: భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఐదేళ్ల క్రితం ఇదే సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశానని.. ఎంపీలందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంట్ ను ప్రజాస్వామ్య దేవాలయంగా వర్ణించారు.
దేశ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రజల సంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు. శాంతి, సామరస్య విలువ గురించి ఆయన ప్రసంగించారు. ప్రజలు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చే హక్కు ఉందని అయితే ఇది గాంధేయవాదంగా ఉండాలని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబం అలని.. తాను ఎప్పుడూ ఇందులో ఒక భాగమని కోవింద్ అన్నారు. ఏ కుటుంబంలో అయినా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఎంపీలకు సూచించారు.
Also Read
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
Read Also: Smiti Irani: 18 ఏళ్ల నా కూతురిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇబ్బందిపడుతోందని.. మహమ్మారి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తున్నట్లు రామ్ నాథ్ కోవింద్ అన్నారు. కష్ట సమయాల్లో భారత దేశ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగటా ప్రశంసించబడ్డాయని రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో అన్నారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని..ఆమె మార్గదర్శకత్వం నుంచి దేశం ప్రయోజనం పొందుతుందని అన్నారు. రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పించిన దేశ పౌరులకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. ఈ నెల 25 సోమవారం రోజున భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.
President Ram Nath Kovind's farewell ceremony by the MPs of Rajya Sabha and Lok Sabha is underway at the Parliament.
Five years ago, I took oath as President of India here in Central Hall. All MPs have a special place in my heart: President Ram Nath Kovind
(Source: Sansad TV) pic.twitter.com/8fC8fwu1sO
— ANI (@ANI) July 23, 2022
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!