President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు.. భావోద్వేగ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
president Ram Nath Kovind’s farewell ceremony: భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఐదేళ్ల క్రితం ఇదే సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశానని.. ఎంపీలందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంట్ ను ప్రజాస్వామ్య దేవాలయంగా వర్ణించారు.
దేశ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రజల సంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు. శాంతి, సామరస్య విలువ గురించి ఆయన ప్రసంగించారు. ప్రజలు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చే హక్కు ఉందని అయితే ఇది గాంధేయవాదంగా ఉండాలని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబం అలని.. తాను ఎప్పుడూ ఇందులో ఒక భాగమని కోవింద్ అన్నారు. ఏ కుటుంబంలో అయినా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఎంపీలకు సూచించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Smiti Irani: 18 ఏళ్ల నా కూతురిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇబ్బందిపడుతోందని.. మహమ్మారి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తున్నట్లు రామ్ నాథ్ కోవింద్ అన్నారు. కష్ట సమయాల్లో భారత దేశ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగటా ప్రశంసించబడ్డాయని రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో అన్నారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని..ఆమె మార్గదర్శకత్వం నుంచి దేశం ప్రయోజనం పొందుతుందని అన్నారు. రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పించిన దేశ పౌరులకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. ఈ నెల 25 సోమవారం రోజున భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.
President Ram Nath Kovind's farewell ceremony by the MPs of Rajya Sabha and Lok Sabha is underway at the Parliament.
Five years ago, I took oath as President of India here in Central Hall. All MPs have a special place in my heart: President Ram Nath Kovind
(Source: Sansad TV) pic.twitter.com/8fC8fwu1sO
— ANI (@ANI) July 23, 2022
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!