దీదీతో పీకే సుదీర్ఘ మంతనాలు.. ప్లాన్ అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు గురించి చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.. జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చ సాగగా.. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై మంతనాలు సాగాయంటున్నారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోగా.. ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన దీదీ.. ఇప్పుడు అదే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.. దానికోసం ప్రశాంత్ కిశోర్ సారథ్యంలో బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం అవుతాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
also read పెరిగిన మదర్ డెయిరీ పాల ధర.. రేపటి నుంచే అమల్లోకి..
Also Read
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
ఇక, ఇప్పటికే సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో కూడా రెండు దపాలుగా సమావేశమైన పీకే.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారంటూ వార్తలు వచ్చాయి.. పవార్తో పాటు ఈ ఏడాది మార్చిలో టిఎంసిలో చేరిన మాజీ బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాతో చర్చలు జరిపారు.. అనంతరంగా.. ఢిల్లీ వేదికగా.. కాంగ్రెస్, బీజేపీయేతర నేతలతో సమావేశం కూడా నిర్వహించారు.. ఈ భేటీకి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, రాష్ట్రీయ లోక్ దళ్ జయంత్ చౌదరి, ఎన్సిపి ప్రఫుల్ పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ సుశీల్ గుప్తా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బినోయ్ విశ్వం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నిలోత్పాల్ బసు పాల్గొన్నారు. ఇంధన ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి పలు అంశాలపై చర్చించారు.
తాజావార్తలు
-
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!