Sadhvi Pragya: నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తా..
- కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా..
- తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను: ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
Sadhvi Pragya: మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో ఆమె కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శించారు. హస్తం పార్టీ తనను చిత్రహింసకు గురి చేసిందన్నారు. ఏటీఎస్ కస్టడీకి పంపింది.. ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా తెలిపారు.
Read Also: Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
అయితే, తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు కనిపిస్తోంది. కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. వైద్య చికిత్స పేరుతో గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.. సాధ్వి ప్రజ్ఞా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
Read Also: Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారులకు ఊరట..
ఇక, ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై పేర్లను రాయాలని డిమాండ్ చేసింది. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల షాప్స్ పై వారి పేర్లను రాసి ఉంచాలని కోరారు. అయితే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దుకాణుదారులు తమ పేర్లును తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
#कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX
— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో