Sadhvi Pragya: నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తా..
- కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా..
- తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను: ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadhvi Pragya: మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో ఆమె కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శించారు. హస్తం పార్టీ తనను చిత్రహింసకు గురి చేసిందన్నారు. ఏటీఎస్ కస్టడీకి పంపింది.. ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా తెలిపారు.
Read Also: Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్లోకి గ్యాంగ్స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
అయితే, తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు కనిపిస్తోంది. కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. వైద్య చికిత్స పేరుతో గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.. సాధ్వి ప్రజ్ఞా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
Read Also: Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారులకు ఊరట..
ఇక, ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై పేర్లను రాయాలని డిమాండ్ చేసింది. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల షాప్స్ పై వారి పేర్లను రాసి ఉంచాలని కోరారు. అయితే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దుకాణుదారులు తమ పేర్లును తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
#कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX
— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!