Sadhvi Pragya: నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తా..
- కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా..
- తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను: ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadhvi Pragya: మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో ఆమె కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శించారు. హస్తం పార్టీ తనను చిత్రహింసకు గురి చేసిందన్నారు. ఏటీఎస్ కస్టడీకి పంపింది.. ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా తెలిపారు.
Read Also: Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అయితే, తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు కనిపిస్తోంది. కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. వైద్య చికిత్స పేరుతో గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.. సాధ్వి ప్రజ్ఞా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
Read Also: Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారులకు ఊరట..
ఇక, ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై పేర్లను రాయాలని డిమాండ్ చేసింది. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల షాప్స్ పై వారి పేర్లను రాసి ఉంచాలని కోరారు. అయితే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దుకాణుదారులు తమ పేర్లును తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
#कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX
— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!