US Report: అమెరికా మానవహక్కుల నివేదికపై భారత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: దేశంలో మానవహక్కుల పరిస్థితులపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది మణిపూర్ హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో గణనీయమైన మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఇది తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని, భారత్పై సరైన అవగాహన లేదనే విషయాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గురువారం విదేశాంగ మంత్రిత్వశాఖ వారపత్రిక మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది మరియు భారతదేశంపై చాలా తక్కువ అవగాహనను ప్రతిబింబిస్తుంది. మేము దీనికి ఎటువంటి విలువ ఇవ్వము మరియు మీరు కూడా అలాగే పరిగణించండి” అని ఆయన అన్నారు.
ఇటీవల విడుదలైన ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్: ఇండియా’ నివేదికలో అమెరికా ఈ ఆరోపణల్ని చేసింది. మణిపూర్లోని మెయిటీ, కుకీ కమ్యూటీల మధ్య జాతి వివాదం ‘‘మానవహక్కుల ఉల్లంఘనకు’ దారి తీసిందని పేర్కొంది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోడీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Mumbai: కారులో ఆడుకుంటుండగా లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
ఇదే కాకుండా ఈ నివేదికలో జమ్మూ కాశ్మీర్లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతంలో పలుమార్లు దేశంలో మానవహక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని అమెరికా రిపోర్టులు ఇచ్చింది. ప్రతీసారి కూడా భారత్ దీనిని తీవ్రంగా తప్పుబడుతూనే ఉంది.
గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. మెజారిటీ మైయిటీ, కుకీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని మైయిటీ వర్గం కోరడాన్ని కుకీలు వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో పలువురు మరణించారు. చాలా మంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలివేరే ప్రాంతాలకు వెళ్లారు. అయితే, ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!