Union Minister Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- కేంద్ర మంత్రి కుమార్తె్కు వేధింపులు
- తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని రోజుల క్రితం పూణేలో ఆగి ఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి జాతరలో తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆదివారం తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్ నగర్ ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది.
Also Read:V. Hanumantha Rao: వీహెచ్ తీరుపై ఏఐసీసీ ఆగ్రహం.. స్పందించిన హనుమంతరావు..
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ జాతర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు జాతరకు వెళ్ళింది. అక్కడ కొంతమంది యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేయడానికి నేను పోలీస్ స్టేషన్కు వెళ్లాను” అని రక్షా ఖడ్సే మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో మంత్రుల కుటుంబాలు కూడా సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటీ? అని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read:Harish Rao : సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు బహిరంగ లేఖ..
రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. “ఈ యువకులపై పోలీసులకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అబ్బాయిలు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయి. నేరస్థులు పోలీసులకు భయపడరు. అమ్మాయిలు ఫిర్యాదులు చేయడానికి ముందుకు రారు. తల్లిదండ్రులు తమ కూతుళ్ల పేర్లు వెల్లడించడానికి వెనకాడతారు. మాకు వేరే మార్గం లేకపోవడంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము” అని అన్నారు.
Also Read:SLBC Tunnel: టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్కి తీవ్ర ఆటంకం..
ముక్తాయ్ నగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుషానత్ పింగ్డే మాట్లాడుతూ.. నిందితులు చాలా మంది బాలికలతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందితో ఘర్షన పడ్డారని ఆయన అన్నారు. ఈ కేసులో ఆయన ఏడుగురు నిందితుల పేర్లను వెల్లడించారు. వారిలో ఒకరిని అరెస్టు చేశామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!