బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం నాడు ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు నిర్మాతలు.
Also Read : EMPURAAN : హై ఓల్డేజ్ మూవీగా ఎంపురన్
తాజా నిర్ణయంతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఫస్ట్ వీక్ లో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, “మా పంపిణీదారుల అభ్యర్థన మరియు మద్దతుతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటు మార్చి 28న విడుదల కానున్న ‘రాబిన్హుడ్’ చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది.” అన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ‘టిల్లు స్క్వేర్’ బాటలో పయనించి, మరో ఘన విజయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. పైగా ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి ఘన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ను సాధిస్తామనే నమ్మకంతో సితార ఉంది.