BPSC Exam Row: బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు.. అభ్యర్థులను ప్రశాంత్ కిషోర్ రెచ్చగొట్టారని కేసు!
- పరీక్షల్లో అవకతవకలపై బీహార్లో కొనసాగుతున్న ఆందోళనలు..
- అభ్యర్థులను ప్రశాంత్ కిషోర్ రెచ్చగొట్టడంతో పోలీస్ కేసు నమోదు..
- 700 మంది నిరసనకారులు, పీకే, కోచింగ్ సెంటర్ల యజమానులపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BPSC Exam Row: బీహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులతో పాటు మరో 700 మంది నిరసనకారులపై కేసు ఫైల్ చేశారు. కాగా, ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ దగ్గర ఆందోళనలు చేపట్టగా.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
Read Also: Mamata Banerjee: నేడు సందేశ్ఖాలీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అయితే, విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ నిరసనలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా పీకే అభ్యర్థులను రెచ్చగొట్టడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు చెప్పుకొచ్చారు. తమ మార్గ దర్శకాలను పాటించకపోవడంతోనే ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.
Read Also: Heavy Snowfall: జమ్మూ కశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు.. వాయిదా పడిన పరీక్షలు!
ఇక, డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు. పరీక్షను క్యాన్సిల్ చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు. అయితే, పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని బీపీఎస్సీ అధికారులు తేల్చి చెప్పారు. పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించాం.. అభ్యర్థుల వాదనలకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!