POK: పీఓకే భారత్లో విలీనం అవుతుంది.. మాజీ ఆర్మీ చీఫ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: గత కొంతకాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు నడుస్తున్నాయి. సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిల్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు తాము భారత్ లో కలుస్తామని ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గిల్గిల్ ప్రాంత ప్రజలు తమకు భారత్ కార్గిల్ ద్వారాలు తెరవాలంటూ ప్రాధేయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుత బీజేపీ నేత వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం తరువాత పీఓకే భారత్ లో విలీనం అవుతుందని సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ లో విలీనం చేయాలంటూ పీఓకే ప్రజలు డిమాండ్లపై ప్రశ్నించగా..పీఓకే భారత్లో కలుస్తుందని, కొంత సమయం వేచి ఉండండి అని అన్నారు. రాజస్థాన్ లోని దౌసాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?
చైనా తన మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను కలుపుకోవడంపై వీకే సింగ్ స్పందించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మ్యాపులపై అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇది చైనా ‘పాత అలవాటు’ అని అన్నారు. కేవలం భారత్ భూభాగాలను చేర్చినంత మాత్రాన ఏమీ జ రగని ఆయన అన్నారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని, పాకిస్తాన్, చైనా కాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని విమర్శించారు.
అంతకుముందు పీఓకే గురించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ లేనంతగా ఆర్థిక, రాజకీయ సమస్యల్లో ఉందని, పీఓకేని భారత్ హస్తగతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మేలో గోవాలో జరిగి ఎస్సీఓ మీటింగ్లో పీఓకేని ఎప్పుడు ఖాళీ చేస్తారు..? ఉగ్రవాదానికి పాక్ నిధులు సమకూర్చడంపై జైశంకర్ ప్రశ్నించారు. అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!