POK: పీఓకే భారత్లో విలీనం అవుతుంది.. మాజీ ఆర్మీ చీఫ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: గత కొంతకాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు నడుస్తున్నాయి. సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిల్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు తాము భారత్ లో కలుస్తామని ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గిల్గిల్ ప్రాంత ప్రజలు తమకు భారత్ కార్గిల్ ద్వారాలు తెరవాలంటూ ప్రాధేయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుత బీజేపీ నేత వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం తరువాత పీఓకే భారత్ లో విలీనం అవుతుందని సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ లో విలీనం చేయాలంటూ పీఓకే ప్రజలు డిమాండ్లపై ప్రశ్నించగా..పీఓకే భారత్లో కలుస్తుందని, కొంత సమయం వేచి ఉండండి అని అన్నారు. రాజస్థాన్ లోని దౌసాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
Read Also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?
చైనా తన మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను కలుపుకోవడంపై వీకే సింగ్ స్పందించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మ్యాపులపై అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇది చైనా ‘పాత అలవాటు’ అని అన్నారు. కేవలం భారత్ భూభాగాలను చేర్చినంత మాత్రాన ఏమీ జ రగని ఆయన అన్నారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని, పాకిస్తాన్, చైనా కాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని విమర్శించారు.
అంతకుముందు పీఓకే గురించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ లేనంతగా ఆర్థిక, రాజకీయ సమస్యల్లో ఉందని, పీఓకేని భారత్ హస్తగతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మేలో గోవాలో జరిగి ఎస్సీఓ మీటింగ్లో పీఓకేని ఎప్పుడు ఖాళీ చేస్తారు..? ఉగ్రవాదానికి పాక్ నిధులు సమకూర్చడంపై జైశంకర్ ప్రశ్నించారు. అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!