Delhi: రేపు పీఎంవో అత్యున్నత సమావేశం.. దేనికోసమంటే..!
- రేపు పీఎంవో అత్యున్నత సమావేశం
- ట్రంప్ సుంకాలపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు పీఎంవో కీలక సమావేశం నిర్వహిస్తోంది. అధిక సుంకాలు కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి చర్చించనున్నారు. 50 శాతం సుంకాలు కారణంగా సమస్యలు తలెత్తుతాయని భారత్ భావిస్తోంది. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రత్యేక రసాయనాలు, పలు కీలక రంగాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: India-Pakistan: దాయాది దేశానికి భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
Also Read
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
భారత్పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఆసియాలోని భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతోనే ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి పుతిన్ ముందుకు రావడం లేదని అమెరికా వాదిస్తోంది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై జరిమానా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం జరిమానా విధించలేదు. కేవలం భారత్పైనే భారీ సుంకం విధించారు. చమురు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడే కొనుగోలు చేస్తామని భారత్ స్పష్టం చేసింది. మొత్తానికి సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!