Supreme Court: దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
- దివ్యాంగులపై జోకులేంటి?
- కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
స్టాండప్ కమెడియన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దివ్యాంగులపై షోల్లో జోక్లు వేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: JK: షాకింగ్ ప్రమాదం.. వర్ధమాన క్రికెటర్ దుర్మరణం
Also Read
జోక్ల పేరుతో దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు వేయడాన్ని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ తప్పుపట్టింది. కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, బాల్రాజ్ పరమ్జీత్ సింగ్, సోనాలి ఠక్కర్ తదితరులను బాధ్యులుగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. సోమవారం వారిపై సీరియస్ అయింది. తక్షణమే మీ సోషల్ మీడియా ఛానెల్స్లో క్షమాపణ చెప్పాలని సూచించింది. కామిక్స్ తమ యూట్యూబ్ ఛానెల్లో క్షమాపణ పోస్ట్ చేయాలని.. వారు భరించడానికి సిద్ధంగా ఉన్న జరిమానా గురించి కోర్టుకు తెలియజేయాలని ఉత్తర్వులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Amit Shah: కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే.. ధన్ఖర్ గురించి అమిత్ షా ఏమన్నారంటే..!
ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ వాదనలు వినిపించారు. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. కామిక్స్, ఇన్ఫ్లుయెన్సర్లకు మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రం కొంత సమయం తీసుకుంటుందని వెంకటరమణి అన్నారు. మార్గదర్శకాలు ఒక సంఘటనకు ప్రతిస్పందనగా ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలని.. మేము డొమైన్ నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరుకుంటున్నట్లు జస్టిస్ కాంత్ అన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
సుప్రీంకోర్టు బలమైన సందేశం పంపిందని సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ చెప్పినప్పుడు.. జస్టిస్ కాంత్ బదులిస్తూ.. ‘‘క్షమాపణ ఒక విషయం… కానీ దీని కోసం ప్రతిసారీ ఒక ఫౌండేషన్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఎవరైనా వ్యక్తి బాధితులైతే ఏమి చేయాలి?” అన్నారు. జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ.. ‘‘హాస్యం జీవితంలో ఒక భాగం. మనం మనల్ని జోకులుగా చేసుకోవచ్చు. కానీ మీరు ఇతరులను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదు. సున్నితత్వం ఉల్లంఘన జరుగుతుంది. భారతదేశం చాలా సమాజాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. నేటి ప్రభావశీలులు అని పిలవబడేవారు.. ప్రసంగాన్ని వాణిజ్యీకరించేటప్పుడు మనోభావాలను గాయపరచలేరు” అని అన్నారు.
తాజావార్తలు
-
Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
-
Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!