PM Modi: ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్..
- ట్రంప్ నా కోసం భద్రతను పక్కన పెట్టారు..
- లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ..
- ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికన్ పాడ్కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు.
‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళాను, మీకు అభ్యంతరం లేకపోతే మనం స్టేడియం చుట్టూ ఒక రౌండ్ ఎందుకు తిరగకూడదు అని మామూలుగా అన్నాను’’ అని ట్రంప్తో అన్నానని మోడీ చెప్పారు. అందుకు ట్రంప్ ‘‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం కలిసి నడుద్దాం, వారిని పలకరిద్దాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. అమెరికా కఠినమైన భద్రతా ప్రోటోకాల్లో ఇలాంటి తీరు అసాధారణమని మోడీ చెప్పారు. అమెరికన్ సమాజంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రెసిడెంట్ ఇలా తిరగడం అసాధ్యమని చెప్పారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: BJP MLA: “కేదార్నాథ్లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
ట్రంప్ ఏ మాత్రం సంకోచించకుండా, తన మాటను అంగీకరించి స్టేడియంలో తిరగడం ప్రారంభించినట్లు మోడీ వెల్లడించారు. ఇది ట్రంప్ భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.‘‘ఆ క్షణం నా మనసును తాకిందని, అది అతడి ధైర్యాన్ని చూపించింది’’ అని అన్నారు. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం గురంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన ప్రచారంలో ట్రంప్కు కాల్పులు జరిగినప్పుడు, ఆ స్టేడియంలో నాతో చేయి చేయి కలిపి నడిచిన అదే దృఢ సంకల్పం కలిగిన అధ్యక్షుడు ట్రంప్ను నేను చూశాను’’ అని మోడీ అన్నారు.
‘‘ బుల్లెట్ తాకిన తర్వాత కూడా, ఆయన అమెరికాకు అచంచలంగా అంకితభావాన్ని ప్రదర్శించాడు. అతడి జీవితం దేశం కోసమే. నేను భారతదేశాన్ని నమ్మినట్లే, అతడు అమెరికా స్ఫూర్తిని చూపించారు. నేను భారత్ ఫస్ట్ అని అనుకుంటాను. అందుకే మేము కనెక్ట్ అయ్యాము.’’ అని మోడీ చెప్పారు. జూలై13న పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ట్రంప్ ప్రాణాలు దక్కాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!