PM Modi: ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్..
- ట్రంప్ నా కోసం భద్రతను పక్కన పెట్టారు..
- లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ..
- ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికన్ పాడ్కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు.
‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళాను, మీకు అభ్యంతరం లేకపోతే మనం స్టేడియం చుట్టూ ఒక రౌండ్ ఎందుకు తిరగకూడదు అని మామూలుగా అన్నాను’’ అని ట్రంప్తో అన్నానని మోడీ చెప్పారు. అందుకు ట్రంప్ ‘‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం కలిసి నడుద్దాం, వారిని పలకరిద్దాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. అమెరికా కఠినమైన భద్రతా ప్రోటోకాల్లో ఇలాంటి తీరు అసాధారణమని మోడీ చెప్పారు. అమెరికన్ సమాజంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రెసిడెంట్ ఇలా తిరగడం అసాధ్యమని చెప్పారు.
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
Read Also: BJP MLA: “కేదార్నాథ్లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
ట్రంప్ ఏ మాత్రం సంకోచించకుండా, తన మాటను అంగీకరించి స్టేడియంలో తిరగడం ప్రారంభించినట్లు మోడీ వెల్లడించారు. ఇది ట్రంప్ భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.‘‘ఆ క్షణం నా మనసును తాకిందని, అది అతడి ధైర్యాన్ని చూపించింది’’ అని అన్నారు. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం గురంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన ప్రచారంలో ట్రంప్కు కాల్పులు జరిగినప్పుడు, ఆ స్టేడియంలో నాతో చేయి చేయి కలిపి నడిచిన అదే దృఢ సంకల్పం కలిగిన అధ్యక్షుడు ట్రంప్ను నేను చూశాను’’ అని మోడీ అన్నారు.
‘‘ బుల్లెట్ తాకిన తర్వాత కూడా, ఆయన అమెరికాకు అచంచలంగా అంకితభావాన్ని ప్రదర్శించాడు. అతడి జీవితం దేశం కోసమే. నేను భారతదేశాన్ని నమ్మినట్లే, అతడు అమెరికా స్ఫూర్తిని చూపించారు. నేను భారత్ ఫస్ట్ అని అనుకుంటాను. అందుకే మేము కనెక్ట్ అయ్యాము.’’ అని మోడీ చెప్పారు. జూలై13న పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ట్రంప్ ప్రాణాలు దక్కాయి.
తాజావార్తలు
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ