Devendra Fadnavis: 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటర్..
- సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్- సంజయ్ రౌత్ కామెంట్స్..
- 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని: దేవేంద్ర ఫడ్నీవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ నెలలో నరేంద్రమోడీ రిటైర్ అవబోతున్నారని ఆయన కామెంట్స్ చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రౌత్ వాదనల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2029 ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రధాని పదవిలో కొనసాగుతారని చెప్పారు.
సంజయ్ రౌత్ మొఘల్ మనస్తత్వం కలిగి ఉన్నాడని ఫడ్నవీస్ విమర్శించాడు. భారతీయ సంస్కృతిలో పెద్దలు ఉన్నప్పుడు చిన్నవారు పదవుల గురించి ఆలోచించారని, ఆయనది మొఘల్ సంస్కృతి అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించడం వెనక కారణం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి తన పదవీ విరమణ గురించి తెలియజేయడమే అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
Read Also: Meerut murder case: జైల్లో నిందితులకు రామాయణం అందజేసిన నటుడు
‘‘ మోడీ జీ మా నాయకుడు, ఆయన భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. 2029లో కూడా మోడీని ప్రధాని మంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. పదవీవిరమణ, అత్యున్నత పదవి గురించి చర్చించడానికి మేము అర్హులం కాదు’’ అని ఫడ్నవీస్ అన్నారు. సెప్టెంబర్ నెలలో బహుశా ప్రధాని మోడీ పదవీ విరమణ చేయబోతున్నారు, అందుకే దరఖాస్తు చేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండొచ్చు అని రౌత్ అన్నారు. సంఘ్ పరివార్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటోందని, ప్రధాని మోడీ కాలం ముగిసిందని అన్నారు.
సెప్టెంబర్ 17న 75 ఏళ్లు నిండనున్న ప్రధానమంత్రి ఈ ఏడాది రాజీనామా చేస్తారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ గతంలో ఈ నిబంధన పెట్టిందని, అంతకన్నా పెద్ద వయసున్న పార్టీ నాయకులు మంత్రి పదవులు పొందలేరని ఆయన అన్నారు. అలాంటి నియమం ఏమి లేదని బీజేపీ చెబుతోంది.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!