Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటన
- స్పందించిన బాధితురాలి తండ్రి
- ఈ ఘటనలో పూర్తి బాధ్య ఆస్పత్రిదే అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు. ఆయన మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఘటన జరిగినా.. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి ఫోన్ కూడా రాలేదని, మా యోగక్షేమాలు కూడా ఆరా తీయలేదన్నారు. ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటన జరిగిన తర్వాత 6 నుంచి 7 గంటలపాటు తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ప్రిన్సిపాల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
READ MORE: Kurnool: హంద్రీ నదిలో చిక్కుకున్న 25 మంది కూలీలు
Also Read
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
తండ్రి తన కుమార్తెతో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. “ఆమె ఆ రోజు రాత్రి 8.10 కి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 11.15 గంటలకు తల్లికి ఫోన్ చేసింది. నేను కూడా అక్కడే ఉండి ఫోన్ వింటున్నాను. మా భోజనం వచ్చిందని ఫోన్లో చెప్పింది. అందరం కలిసి భోజనం చేశామని.. మీరు కూడా తిన్నారా? అని అడిగింది. నాతో మాట్లాడుతూ.. ఆహారం తిని మందు వేసుకుని పడుకో అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం 10:53 గంటలకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా కుమార్తె మృతదేహాన్ని మొదటిసారి చూశాము. ఎందుకంటే అప్పటి వరకు మృతదేహం పోలీసు స్టేషన్ ఆసుపత్రిలోనే ఉంచారు. పోస్ట్మార్టం ఆలస్యమైంది. శవపరీక్ష అనంతరం పోలీసులు హడావుడిగా మృతదేహాన్ని కాల్చడానికి గ్రీన్ కారిడార్ను తయారు చేశారు.” అని చెప్పారు. తన కుమార్తె పోస్ట్మార్టం నివేదికపై కూడా బాధితురాలి తండ్రి ప్రశ్నలు సంధించారు. చాలా చిత్రహింసలు పెట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!