Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటన
- స్పందించిన బాధితురాలి తండ్రి
- ఈ ఘటనలో పూర్తి బాధ్య ఆస్పత్రిదే అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు. ఆయన మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఘటన జరిగినా.. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి ఫోన్ కూడా రాలేదని, మా యోగక్షేమాలు కూడా ఆరా తీయలేదన్నారు. ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటన జరిగిన తర్వాత 6 నుంచి 7 గంటలపాటు తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ప్రిన్సిపాల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
READ MORE: Kurnool: హంద్రీ నదిలో చిక్కుకున్న 25 మంది కూలీలు
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
తండ్రి తన కుమార్తెతో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. “ఆమె ఆ రోజు రాత్రి 8.10 కి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 11.15 గంటలకు తల్లికి ఫోన్ చేసింది. నేను కూడా అక్కడే ఉండి ఫోన్ వింటున్నాను. మా భోజనం వచ్చిందని ఫోన్లో చెప్పింది. అందరం కలిసి భోజనం చేశామని.. మీరు కూడా తిన్నారా? అని అడిగింది. నాతో మాట్లాడుతూ.. ఆహారం తిని మందు వేసుకుని పడుకో అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం 10:53 గంటలకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా కుమార్తె మృతదేహాన్ని మొదటిసారి చూశాము. ఎందుకంటే అప్పటి వరకు మృతదేహం పోలీసు స్టేషన్ ఆసుపత్రిలోనే ఉంచారు. పోస్ట్మార్టం ఆలస్యమైంది. శవపరీక్ష అనంతరం పోలీసులు హడావుడిగా మృతదేహాన్ని కాల్చడానికి గ్రీన్ కారిడార్ను తయారు చేశారు.” అని చెప్పారు. తన కుమార్తె పోస్ట్మార్టం నివేదికపై కూడా బాధితురాలి తండ్రి ప్రశ్నలు సంధించారు. చాలా చిత్రహింసలు పెట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!