Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటన
- స్పందించిన బాధితురాలి తండ్రి
- ఈ ఘటనలో పూర్తి బాధ్య ఆస్పత్రిదే అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు. ఆయన మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఘటన జరిగినా.. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి ఫోన్ కూడా రాలేదని, మా యోగక్షేమాలు కూడా ఆరా తీయలేదన్నారు. ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటన జరిగిన తర్వాత 6 నుంచి 7 గంటలపాటు తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ప్రిన్సిపాల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
READ MORE: Kurnool: హంద్రీ నదిలో చిక్కుకున్న 25 మంది కూలీలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తండ్రి తన కుమార్తెతో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. “ఆమె ఆ రోజు రాత్రి 8.10 కి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 11.15 గంటలకు తల్లికి ఫోన్ చేసింది. నేను కూడా అక్కడే ఉండి ఫోన్ వింటున్నాను. మా భోజనం వచ్చిందని ఫోన్లో చెప్పింది. అందరం కలిసి భోజనం చేశామని.. మీరు కూడా తిన్నారా? అని అడిగింది. నాతో మాట్లాడుతూ.. ఆహారం తిని మందు వేసుకుని పడుకో అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం 10:53 గంటలకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా కుమార్తె మృతదేహాన్ని మొదటిసారి చూశాము. ఎందుకంటే అప్పటి వరకు మృతదేహం పోలీసు స్టేషన్ ఆసుపత్రిలోనే ఉంచారు. పోస్ట్మార్టం ఆలస్యమైంది. శవపరీక్ష అనంతరం పోలీసులు హడావుడిగా మృతదేహాన్ని కాల్చడానికి గ్రీన్ కారిడార్ను తయారు చేశారు.” అని చెప్పారు. తన కుమార్తె పోస్ట్మార్టం నివేదికపై కూడా బాధితురాలి తండ్రి ప్రశ్నలు సంధించారు. చాలా చిత్రహింసలు పెట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..