PM Modi: ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యలకు మోడీ కౌంటర్
- ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యలకు మోడీ కౌంటర్
- కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారయ్యాయని మోడీ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Goa: కాంగ్రెస్కు స్పీకర్ షాక్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పిటిషన్ కొట్టివేత
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
రాష్ట్ర బడ్జెట్ ఆధారంగా ఎన్నికల గ్యారంటీలను ప్రకటించాలని, ఇష్టమొచ్చినట్లు హామీలివ్వరాదని రాష్ట్ర ఇంచార్జ్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సూచించారు. ఆర్థికంగా అమలు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీనికి కౌంటర్గా మోడీ ట్వీట్ చేశారు. ‘‘అడ్డగోలు హామీలు ప్రకటించడం చాలా తేలికైన విషయమే. కానీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినం, అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తారు. వాటిని ఎప్పటికీ నెరవేర్చలేరని కూడా వారికి తెలుసు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇప్పుడు బయట పడింది. ప్రజల ముందు దోషుల్లా నిలబడి ఉంది. ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేయడమే. ఇలాంటి రాజకీయాల వల్ల నష్టపోయే బాధితులు పేదలు, యువకులు, రైతులు, మహిళలే. వీరంతా గ్యారంటీల ప్రయోజనాలకు దూరమవుతారు. ఉన్న పథకాలు కూడా వారికి దక్కుండాపోతాయి’ అని మోడీ పేర్కొన్నారు. హర్యానా ప్రజలు మాత్రం కాంగ్రెస్ మోసాన్ని తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అమలు కాని వాగ్దానాలు చేసి మోసం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి మరియు పురోగతిని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.
The people of the country will have to be vigilant against the Congress sponsored culture of fake promises! We saw recently how the people of Haryana rejected their lies and preferred a Government that is stable, progress oriented and action driven.
There is a growing…
— Narendra Modi (@narendramodi) November 1, 2024
తాజావార్తలు
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!